Rohit Sharma: దానిని సాకుగా చూపించలేను.. ఓటమిని ఒప్పుకున్న రోహిత్ శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React on India Defeat on CWC FInal 2023 vs Australia: ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అసాధారణ బ్యాటింగే టీమిండియాకు వన్డే ప్రపంచకప్ను దూరం చేసిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని, 20-30 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ప్రపంచకప్ 2023లో జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, అయితే ఫైనల్లో ఫలితం ఇలా ఉండాల్సింది కాదని రోహిత్ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ భావోద్వేగం చెందాడు.
‘ఈరోజు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. ఫైనల్ మ్యాచ్లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. మేము ప్రతిదీ ప్రయత్నించాము కానీ కుదరలేదు. మరో 20-30 పరుగులు చేసుంటే బాగుండేది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 270-280 స్కోరు పక్కా అనుకున్నాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయాం. స్కోర్ బోర్డ్లో 240 పరుగులు ఉన్నపుడు త్వరగా వికెట్లు తీయాలి. మేము ఆరంభంలో వికెట్స్ తీసినా.. ఆ తర్వాత తేలిపోయాం’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Earthquake in Maharashtra: మహారాష్ట్రలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు
‘మూడు వికెట్లు పడిన తర్వాత ఆస్ట్రేలియా పెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్లకు పూర్తి ఘనత దక్కుతుంది. మా నుంచి ఈ ఇద్దరు మ్యాచ్ను దూరం చేశారు. మేము చేయగలిగినదంతా ప్రయత్నించాము కానీ ఫ్లడ్లైట్ల కింద పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని తెలుసు. కానీ దీన్ని సాకుగా చూపించలేను. మేము బోర్డు మీద తగినంత పరుగులు చేయలేదు. ఛేదనలో 3 వికెట్లు తర్వాత మరో వికెట్ తీయాల్సింది. ఫైనల్లో మేం స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేదు. అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన హెడ్, లబుషేన్లకు ఈ క్రెడిట్ దక్కుతుంది’ అని రోహిత్ చెప్పాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!