IND vs AUS: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విశ్రాంతికి అదే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid React on Virat Kohli and Rohit Sharma’s Rest: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. కేవలం 3 వన్డేల కోసం బీసీసీఐ సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించడం. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లకు విశ్రాంతిని ఇవ్వగా.. వీరందరికి మూడో వన్డేలో చోటు దక్కింది. అయితే ప్రపంచకప్ 2023 మరో రెండు వారాల్లో ఆరంభం కానుండగా.. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసం? అని పలువురు బీసీసీఐపై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇవ్వడంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. వారిద్దరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లకు మానసిక, శారీరక విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ల విషయంలో మాకు ఓ క్లారిటీ ఉంది. ప్రపంచకప్ మొదటి ఆరంభం నుంచే వాళ్లు ఫిజికల్గా, మెంటల్గా మంచి పొజిషన్లో ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో వారికి ఎంతో అనుభవం ఉంది. ఎలా ప్రిపేర్ అవ్వాలో వాళ్లకు తెలుసు.టీమ్ అంతా కలిసి చర్చించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం’ అని హెడ్ కోచ్ ద్రవిడ్ తెలిపాడు.
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతే ఈ డెసిషన్ తీసుకున్నాం. సీనియర్ ఆటగాళ్లకు తమ బాధ్యత ఏంటో బాగా తెలుసు. ప్రపంచకప్ మొదటి మ్యాచ్లోనే సరైన మైండ్ సెట్తో దిగడానికి ఏం చేయాలో వాళ్లకు ఓ ఐడియా ఉంది. మూడో వన్డేలో మళ్లీ వాళ్లు ఆడతారు. ఆ తర్వాత ప్రాక్టీస్ మ్యాచులు కూడా ఉన్నాయి’ అని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. మూడో వన్డే సెప్టెంబర్ 27న జరగనుండగా.. అక్టోబర్ 5న మెగా టోర్నీ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!