IND vs AFG U19: అదేం కొట్టుడు స్వామి.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా!
- అండర్-19 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భారత్ ఘన విజయం
- ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని 41.1 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
- కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG U19: హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ లో భారత అండర్-19 జట్టు విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన భారీ 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది.
Elon Musk: లారీ పేజ్ను అధిగమించి.. $800 బిలియన్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక మ్యాచ్ విశ్శ్యానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్ లో ఫైసల్ షినోజాదా 93 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరోవైపు అతనికి తోడుగా ఉజైరుల్లా నియాజై 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేసి టీమిండియా బౌలర్లు కు పరీక్షగా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో రెండు వికెట్లు తీశారు.
New Electricity Connections: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో కీలక మార్పులు.. రేపటి నుండి అమలు!
ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. టీమిండియా డైనమేట్ వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ వైపు పూర్తిగా తిప్పేశాడు. ఆ తర్వాత ఆరన్ జార్జ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి సెంచరీ బాదాడు. ఇక అతనికి తోడుగా కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కూడా 59 బంతుల్లో 62 పరుగులు చేసి విజయానికి సహకరించాడు. చివర్లో విహాన్ మల్హోత్రా అజేయంగా 38 పరుగులతో మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో టీమిండియా అండర్-19 జట్టు వరల్డ్ కప్ ఫైనల్కు అర్హత సాధించింది. ఫైనల్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో అమితుమీ తేల్చుకోనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!