IND vs NZ: న్యూజిలాండ్తో మూడో టెస్ట్.. మరోసారి మూడు మార్పులతో భారత్!
- న్యూజిలాండ్తో మూడో టెస్ట్
- భారీ మార్పులతో బరిలోకి భారత్
- జడేజాకు విశ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత గడ్డపై న్యూజిలాండ్ మొదటిసారి టెస్ట్ సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై ఎదురులేకుండా పోతున్న టీమిండియాకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు చేతులేయడంతోనే బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముంబైలో మూడో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతరం రోహిత్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో మూడో టెస్టులో మార్పులు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండో టెస్టులో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్కు రెస్ట్ ఇచ్చారు. వీరి స్థానాల్లో గిల్, సుందర్, ఆకాశ్కు అవకాశం దక్కింది. మార్పులు చేసినా టీమిండియా ఓడిపోయింది. కనీసం చివరి మ్యాచ్లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. అలానే ఆస్ట్రేలియా సిరీస్ కోసం కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. తొలి టెస్టులో గాయపడిన రిషబ్ పంత్.. రెండో మ్యాచ్లో ఆడాడు. అయితే అతడిపై మరీ ఎక్కువ భారం మోపకుండా.. చివరి మ్యాచ్కు ధ్రువ్ జురెల్ను ఆడించే అవకాశం ఇవ్వనుందని సమాచారం.
Also Read
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
Also Read: YouTube: యూట్యూబ్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆదాయమే ఆదాయం! వారికి మాత్రం నో ఛాన్స్
మొదటి రెండు టెస్టుల్లో ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్లు ఆడాడు. చివరి టెస్టులో అక్షర్ పటేల్ను బరిలోకి దింపాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. జడేజాకు విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో అక్షర్ను ఆడించనున్నారట. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించని మహ్మద్ సిరాజ్ను రెండో టెస్టుకు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. మూడో మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చి.. సిరాజ్ను తీసుకుంటారని సమాచారం.
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!