Site icon NTV Telugu

IT Raids: 25 కేజీల బంగారం, 4 కోట్ల నగదు, 8 లాకర్లు.. రవాణా వ్యాపారి ఇంట్లో అపార సంపద!

Gold

Gold

రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ఉదయ్‌పూర్‌లో గోల్డెన్ ట్రాన్స్‌పోర్ట్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ దాడి అనంతరం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. టీకాంసింగ్‌రావుకు చెందిన ఈ కంపెనీ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో టీకాంసింగ్‌రావు ఇంట్లో రూ.4 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. దీంతో పాటు గోల్డెన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయి.

READ MORE: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!

ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రవాణా వ్యాపారి టికాంసింగ్‌రావు నుంచి అక్రమంగా సరకు రవాణా చేసినట్లు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేయగా.. సమాచారం వాస్తవమేనని తేలింది. దీని తర్వాత నవంబర్ 28న రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. గుజరాత్‌లో 2, ముంబైలో ఒకటి, బన్స్వారా (రాజస్థాన్‌లో మూడు), జైపూర్‌లో (విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా) ఒకటి, ఉదయపూర్‌లోని 19 చోట్ల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. జైపూర్‌లోని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ అవధేష్ కుమార్ ఆదేశాల మేరకు.. ఈ చర్య నవంబర్ 28 ఉదయం ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, జైపూర్, ముంబైతో సహా చాలా చోట్ల కంపెనీకి చెందిన 23 స్థానాల్లో సోదాలు జరుగుతున్నాయి.

READ MORE:Rajendraprasad : అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్రప్రసాద్

గత శుక్రవారం.. ఉదయపూర్‌లోని రవాణా వ్యాపారి టికామ్ సింగ్‌కు చెందిన 19 వేర్వేరు ప్రదేశాలలో సోదాలు జరిగాయి. 25 కిలోల బంగారం కనుగొన్నారు. దాని విలువ సుమారు రూ. 18 కోట్ల 34 లక్షలు ఉంటుందని అంచనా. రవాణా వ్యాపారికి చెందిన దుకాణాలు, వాణిజ్య ప్రాంగణాల్లో ఈ బంగారం లభ్యమైంది. అంతే కాకుండా ఇక్కడ నగదు కూడా దొరికింది. సోదాల్లో 8 లాకర్ల రికార్డులు కూడా లభించాయని, ఈ లాకర్లలో పెద్ద మొత్తంలో బంగారం, నగదు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Exit mobile version