ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ కు నేడే చివరి అవకాశం.. ట్యాక్స్ పేయర్స్ కు కేంద్రం బిగ్ అలర్ట్
- ఐటీఆర్ ఫైలింగ్ కు నేడే చివరి అవకాశం
- ట్యాక్స్ పేయర్స్ కు కేంద్రం బిగ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR ఫైలింగ్) దాఖలు చేయడానికి నేడే చివరి తేదీ (సెప్టెంబర్ 15, 2025). గడువులోగా రిటర్న్ దాఖలు చేయకపోతే, చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. రూ. 5000 వరకు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే, గడువును మరోసారి పొడిగించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ అలర్ట్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు చేసేందుకు గడవు పొడిగించలేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ‘ఐటీఆర్ (IT Returns) ఫైలింగ్ గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించామని తెలిపింది.
Also Read:Sonarika Bhadoria : ‘మహాదేవ్’ ఫేమ్ సోనారికా గుడ్ న్యూస్..
Also Read
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
కానీ, ఆ తేదీని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఏ మాత్రం నిజం లేదని ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబరు 15 చివరి తేదీ అని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను (Income Tax) విభాగం అధికారికంగా ఇచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing), పన్ను చెల్లింపులపై సందేహాలను నివృత్తి చేసేందుకు రౌండ్ ది క్లాక్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామంటూ ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయడం అవసరం. పన్ను చెల్లింపుదారుడు దానిని మిస్ చేస్తే, నిబంధనల ప్రకారం, జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం, గడువు తర్వాత రిటర్న్లను దాఖలు చేసినందుకు పన్ను చెల్లింపుదారులపై జరిమానా విధించే నిబంధన ఉంది. ఇది గరిష్టంగా రూ. 5000 వరకు ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసినందుకు రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.1,000 జరిమానా విధించబడుతుంది.
Also Read:TG Rains: హైదరాబాద్ ను వణికించిన వాన.. అఫ్జల్ సాగర్ నాలాలో పడి కొట్టుకుపోయిన మామ అల్లుడు
ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం కారణంగా, జరిమానాను ఎదుర్కోవడమే కాకుండా, అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. ఉదాహరణకు, పన్ను చెల్లించాల్సి ఉంటే, సెక్షన్ 234A ప్రకారం బకాయి ఉన్న మొత్తానికి 1% నెలవారీ వడ్డీని చెల్లించడం తప్పనిసరి. దీనితో పాటు, నిర్ణీత గడువు తర్వాత దాఖలు చేసిన రిటర్న్ల ప్రాసెసింగ్ సాధారణంగా చాలా సమయం పడుతుంది, దీని కారణంగా తమ వాపసు పొందాలని ఆశించే పన్ను చెల్లింపుదారులు జాప్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!