ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ కు నేడే చివరి అవకాశం.. ట్యాక్స్ పేయర్స్ కు కేంద్రం బిగ్ అలర్ట్
- ఐటీఆర్ ఫైలింగ్ కు నేడే చివరి అవకాశం
- ట్యాక్స్ పేయర్స్ కు కేంద్రం బిగ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR ఫైలింగ్) దాఖలు చేయడానికి నేడే చివరి తేదీ (సెప్టెంబర్ 15, 2025). గడువులోగా రిటర్న్ దాఖలు చేయకపోతే, చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. రూ. 5000 వరకు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే, గడువును మరోసారి పొడిగించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ అలర్ట్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు చేసేందుకు గడవు పొడిగించలేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ‘ఐటీఆర్ (IT Returns) ఫైలింగ్ గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించామని తెలిపింది.
Also Read:Sonarika Bhadoria : ‘మహాదేవ్’ ఫేమ్ సోనారికా గుడ్ న్యూస్..
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
కానీ, ఆ తేదీని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఏ మాత్రం నిజం లేదని ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబరు 15 చివరి తేదీ అని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను (Income Tax) విభాగం అధికారికంగా ఇచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing), పన్ను చెల్లింపులపై సందేహాలను నివృత్తి చేసేందుకు రౌండ్ ది క్లాక్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామంటూ ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయడం అవసరం. పన్ను చెల్లింపుదారుడు దానిని మిస్ చేస్తే, నిబంధనల ప్రకారం, జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం, గడువు తర్వాత రిటర్న్లను దాఖలు చేసినందుకు పన్ను చెల్లింపుదారులపై జరిమానా విధించే నిబంధన ఉంది. ఇది గరిష్టంగా రూ. 5000 వరకు ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసినందుకు రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.1,000 జరిమానా విధించబడుతుంది.
Also Read:TG Rains: హైదరాబాద్ ను వణికించిన వాన.. అఫ్జల్ సాగర్ నాలాలో పడి కొట్టుకుపోయిన మామ అల్లుడు
ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం కారణంగా, జరిమానాను ఎదుర్కోవడమే కాకుండా, అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. ఉదాహరణకు, పన్ను చెల్లించాల్సి ఉంటే, సెక్షన్ 234A ప్రకారం బకాయి ఉన్న మొత్తానికి 1% నెలవారీ వడ్డీని చెల్లించడం తప్పనిసరి. దీనితో పాటు, నిర్ణీత గడువు తర్వాత దాఖలు చేసిన రిటర్న్ల ప్రాసెసింగ్ సాధారణంగా చాలా సమయం పడుతుంది, దీని కారణంగా తమ వాపసు పొందాలని ఆశించే పన్ను చెల్లింపుదారులు జాప్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
తాజావార్తలు
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!