Rs.500: దారుణం.. రూ.500 అప్పు తీర్చలేదని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.500: నేడు ప్రపంచమంతా మనీ మయమైంది. డబ్బు వెనకాలే మనిషి పరిగెత్తుతున్నాడు. మనీ కోసం మాన ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. రూపాయి పోతుందంటే ప్రాణం పోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. తన రూపాయి కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు. మనీ మాయలో పడి మానవత్వాన్ని మర్చిపోయాడు. అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వ్యక్తి అప్పుగా తీసుకున్న రూ.500 చెల్లించకపోవడంతో వ్యక్తి దారుణానికి ఒడికట్టాడు. అప్పు తీర్చలేదన్న కోపంలో కొట్టి చంపేశాడు. మాల్దా జిల్లాలోని బమంగోలాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడి పేరు బన్మాలి సనమ్. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని ప్రఫుల్లా రాయ్గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది.
Read Also: Immoral Relationship : తల్లిని అలా చూసి తట్టుకోలేక.. ఆమె ప్రియుడిని కొట్టి చంపేశారు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రూ.500 ప్రఫుల్లా రాయ్ నుండి బనమాలి సనమ్ అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని ప్రఫుల్ల పదే పదే అడిగేవాడు. కొన్ని కారణాల వల్ల డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. ఆదివారం కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రఫుల్ల బన్మాలి దగ్గరికి వెళ్లాడు. కానీ ఇప్పుడు చెల్లించలేనని బన్మాలి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ప్రఫుల్ల అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత బన్మాలి ఒక టీ దుకాణంలో కూర్చున్నాడు. ఈ సమయంలో ప్రఫుల్ల వెనుక నుంచి వెళ్లి వెదురుతో దాడి చేశాడు. ప్రఫుల్ల.. బన్మాలిని వెదురుతో దారుణంగా కొట్టాడు. ఇందులో బన్మాలి తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బన్మాలి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. బన్మాలిని అతని సోదరుడు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బన్మాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also : Payyavula Keshav: క్విడ్ ప్రోకో… షెల్ కంపెనీలకు పర్యాయపదం వైసీపీ
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!