UK Pensioner : ఏంట్రా ఇదీ.. తాత శవాన్ని ఫ్రిజ్ లో పెట్టి బ్యాంక్ కార్డులతో ఎంజాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK Pensioner : యూకేలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి ప్రతి నెల పింఛన్ వస్తుండేది. సడన్ గా ఆ వ్యక్తి చనిపోవడంతో మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్లో ఉంచాడు. అతడికి ప్రతినెల బ్యాంకులో పడే పింఛన్ తో ఎంజాయ్ చేశాడు. డబ్బు కావాల్సినప్పుడల్లా అతడికి సంబంధించిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి తీసుకుని షాపింగ్ చేసేవాడు. ఏదైనా చాలా కాలం దాగదు కదా. దీంతో ఎలాగోలా విషయం బయటికి పొక్కడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాడు.
Read Also:Ayesha Meera Case: ఆయేషా మీరా కేసులో సత్యంబాబు కీలక వ్యాఖ్యలు..
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా.. యూకేకు చెందిన జాన్ వెయిన్ రైట్(71), డామియన్ జాన్సన్(52) ఓకే ఫ్లాట్ లో కలిసి జీవించేవారు. వీరిద్దరు హామ్ డౌన్ టౌన్ క్లీవ్ ల్యాండ్ టవర్, హోలీవెల్ హెడ్ లోని ఒక ఫ్లాట్ కలిసి ఉండేవారు. ఇద్దరిలో వెయిన్ రైట్ కు పెన్షన్ వస్తుండేది. ఉన్నట్లుండి ఆయన 2018 సెప్టెంబర్ లో చనిపోయాడు. ఈ విషయం అతడి రూమ్ మేట్ ప్రపంచానికి తెలియకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ ఫ్రీజర్ తీసుకొచ్చి, ఆ మృతదేహాన్ని అందులో భద్రపరిచాడు.
Read Also:Jana Reddy: భట్టి పాదయాత్ర.. కోమటిరెడ్డి విషయంపై స్పందించనన్న జానా
అనంతరం అతడి బ్యాంకు సంబంధించిన కార్డులను ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఏటీఎంల ద్వారా డబ్బును డ్రా చేసి షాపింగ్ చేసే వాడు. ఇలా రెండు ఏళ్ల పాటు జాన్ వెయిన్ రైట్ మరణించిన విషయం దాచి ఉంచాడు. 2020 ఆగస్టు 22వ తేదీన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టు తాజాగా అతడు చేసిన పనిపై తీర్పు ఇచ్చింది. కానీ డామియన్ జాన్సన్ కోర్టుకు వివరణ ఇస్తూ తాను షాపింగ్ చేసిన డబ్బు తనదేనని తెలిపాడు. తాము ఇద్దరం బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరిచామని, ఎప్పుడైనా ఆ డబ్బు ఉపయోగించుకునే అర్హత తనకే ఉందని చెప్పారు. జాన్సన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. కానీ వెయిన్ రైట్ ను చట్టబద్ధంగా, మర్యాదగా ఖననం చేయకుండా అడ్డుకున్నారనే అభియోగాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు తొలుత అతడిని దోషిగా తేల్చి.. అనంతరం బెయిల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!