Minister Satya Prasad: పోలాలతోపాటు ఇళ్లకు కూడా జియో ట్యాగింగ్
- గ్రీవెన్స్ ను జీరో స్థాయికి తీసుకురావాలి
- ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయాలి
- చట్టవిరుద్దంగా చేసిన ఫ్రీ హోల్డ్ భూములపై న్యాయ సలహా
- ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పుకోవద్దు
- మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలు
ప్రజలను పదేపదే కార్యాలయాలకు తిప్పుకోవద్దని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు.తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమర్పించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని.. అధికారులంతా ఆ రోజు కార్యాలయాల్లో ఉండాల్సిందేనని, వచ్చిన గ్రీవెన్స్ ను ప్రభావవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. పంటపోలాలకు మాత్రమే కాక త్వరలో ఇళ్లకు, ఇంటి స్థలాలకు కూడా జీయో ట్యాగింగ్ ను తీసుకువస్తామని చెప్పారు. దీని వల్ల భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు. త్వరలోనే రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ఏక కాలంలో రెవిన్యూ సదస్సులతోపాటు రీసర్వేలో జరిగిన పోరపాట్లను కూడా సరి చేయాల్సి ఉందన్నారు.
READ MORE: New Liquor Policy: 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం..
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కలెక్టర్లు తగిన గౌవరం ఇవ్వాలని, వారు తెచ్చిన సమస్యలను నిబంధనలకు అనుగణంగా ఉంటే వెంటనే పరిష్కరించాలని, పోలిటికల్ గవర్నెన్స్ కూడా చాలా ముఖ్యమని కలెక్టర్లకు సూచించారు. మంగళవారం మంగళగిరిలోని సీసీఎల్ఎ కార్యాయలంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్ పి సిసోదియా, సీసీఎల్ఎ జయలక్ష్మీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ శేషగిరి బాబు, ఇతర రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, రిజిస్టర్ కాబడ్డ ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, ప్రజల నుండి వచ్చిన అర్జీలకు పరిష్కారం, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ అంశాలపై కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.
READ MORE:UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్
ఈనెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి…
ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూములపై వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములను చట్ట విరుద్దంగా ఫ్రీ హోల్డ్ చేసి కొంత మంది అనుచిత లబ్ది పోందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూములను వెరిఫై చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 13,59,804 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా ఇప్పటి వరకు 4,17,640 ఎకరాలను వెరిఫై చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా 91,739 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. అలాగే ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో ఇప్పటి వరకు 25,230 ఎకరాలను రిజిస్టర్ చేయగా అందులో నిబంధనలకు విరుద్దంగా 4,245 ఎకరాలను రిజిస్టర్ చేశారు. అయితే ఈనెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ మొత్తం పూర్తవ్వాలని మంత్రి అనగాని ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా నిబంధనలకు విరుద్దంగా చేసిన ఫ్రీహోల్డ్ భూములపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు.
READ MORE:China President: మున్ముందు చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుంది..
అర్జీల పరిష్కారంలో జాప్యంపై సిసోదియా సీరియస్..
అర్జీల పరిష్కారంలో జరుగుతన్న జాప్యంపై రెవిన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోదియా సీరియస్ అయ్యారు. రెవిన్యూ శాఖా మంత్రి కార్యాలయం నుండి 1414 అర్జీలు పరిష్కారం కోసం కలెక్టర్లకు పంపగా కేవలం 16 అర్జీలకు మాత్రమే తిరిగి సమాధానం రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో నుండి గానీ, రెవిన్యూ మంత్రి కార్యాయలం నుండి గానీ, తన కార్యాలయం నుండి గానీ వచ్చిన అర్జీలకు సరైన సమయంలో స్పందించకుంటే ఆయా కలెక్టర్లపై తగు చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మూడు కార్యాలయాల నుండి ఏ సమాచారం అడిగినా వెనువెంటనే స్పందించాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!