CM Chandrababu: రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 19,580 ఉద్యోగాల కల్పన
- చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం
- 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
- ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరుగనుంది. మూడు నెలల్లో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అల్లూరి జిల్లాలో 2300 మెగావాట్ల ప్రాజెక్టు నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. రూ.14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేయనుంది. రూ.10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మెయిల్ సంస్థ ప్రతిపాదన సమర్పించింది.
Skoda Kylaq : ఈ కారు క్రేజ్ వేరే లెవెల్.. స్కోడా కైలక్ బుకింగ్స్ మళ్లీ ప్రారంభం..
Also Read
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు యాస్పరీ లిమిటెడ్కు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.972 కోట్లతో అనంతపురంలో అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆమోదం తెలిపింది. రూ.1163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరిన్ సంస్థ ప్రతిపాదన ఎస్ఐపీబీ ఆమోదించింది. కర్నూలు జిల్లాలో రూ.4435 కోట్లతో ఆయానా రెన్యుబుల్ పవర్ లిమిటెడ్కు ఆమోదం లిభించింది.
Thandel: తండేల్ సెన్సార్ టాక్.. దుల్లగొట్టేయడం ఖాయమట!
యాంపిన్ సంస్థ రూ.3142 కోట్లతో ఏర్పాటు చేయనున్న 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్కు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.3456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఏఈఎల్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రూ.2 వేల కోట్లతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటాపవర్ కు ఆమోదం లభించింది. కాకినాడలో ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు అనుమతి ఇచ్చింది. రూ.1535 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్ కు రూ.305 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.
తాజావార్తలు
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!