CM Chandrababu: రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 19,580 ఉద్యోగాల కల్పన
- చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం
- 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
- ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరుగనుంది. మూడు నెలల్లో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అల్లూరి జిల్లాలో 2300 మెగావాట్ల ప్రాజెక్టు నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. రూ.14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేయనుంది. రూ.10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మెయిల్ సంస్థ ప్రతిపాదన సమర్పించింది.
Skoda Kylaq : ఈ కారు క్రేజ్ వేరే లెవెల్.. స్కోడా కైలక్ బుకింగ్స్ మళ్లీ ప్రారంభం..
Also Read
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు యాస్పరీ లిమిటెడ్కు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.972 కోట్లతో అనంతపురంలో అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆమోదం తెలిపింది. రూ.1163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరిన్ సంస్థ ప్రతిపాదన ఎస్ఐపీబీ ఆమోదించింది. కర్నూలు జిల్లాలో రూ.4435 కోట్లతో ఆయానా రెన్యుబుల్ పవర్ లిమిటెడ్కు ఆమోదం లిభించింది.
Thandel: తండేల్ సెన్సార్ టాక్.. దుల్లగొట్టేయడం ఖాయమట!
యాంపిన్ సంస్థ రూ.3142 కోట్లతో ఏర్పాటు చేయనున్న 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్కు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.3456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఏఈఎల్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రూ.2 వేల కోట్లతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటాపవర్ కు ఆమోదం లభించింది. కాకినాడలో ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు అనుమతి ఇచ్చింది. రూ.1535 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్ కు రూ.305 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!