NTV Telugu Site icon

Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళ.. అనుమానం వచ్చి పరిశీలించగా.. ఏకంగా.?

3 Dosa

3 Dosa

ఓ మహిళ తన స్నేహితులతో కలిసి ఓ ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. తినడానికి దోశను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన దోశను తింటుండగా అనుమానం రావడంతో దోశను నిశితంగా పరిశీలించింది. అలా చూసిన ఆవిడ షాక్ కు గురైంది. హోటల్ వాళ్ళు ఇచ్చిన దోశలో ఏకంగా 8 బొద్దింకలు కనబడ్డాయి. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి సదరు మహిళ విషయాన్ని సోషల్ మీడియాతో పంచుకోవడంతో కాస్త వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Copying in Group-1: గ్రూప్‌-1 పరీక్షల్లో కాపీయింగ్‌.. సెల్‌ఫోన్‌లో చూసి ఎగ్జామ్‌ రాస్తుండగా..

ఇషాని అనే ఓ మహిళ ఢిల్లీలో ఒక ఫేమస్ రెస్టారెంట్ కి తన స్నేహితులతో కలిసి టిఫిన్ చేయడానికి వెళ్ళింది. అక్కడ వారిద్దరూ దోశలను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత దోశలను తీసుకొని తింటుండగా ఇషాని కు దోశలో ఏదో తేడా కనిపించింది. అయితే దోశను మరింతగా పరిశీలించిన ఆవిడకు ఒకంత షాక్ గురైంది. ఆ దోశ లో ఏకంగా 8 బొద్దింకలు బయటపడ్డాయి. దీంతో ఆవిడకి ఒకింత వాంతికి వచ్చినట్లు అయింది. ఆ తర్వాత రెస్టారెంట్ వారిపై ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆమె విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదును చేసింది. దాంతో వెంటనే పోలీసు వారు రెస్టారెంట్ కు చేరుకొని రెస్టారెంట్ లైసెన్స్ చూపించమని కోరగా.. రెస్టారెంట్ యజమానులు తమ వద్ద ఎలాంటి లైసెన్సులు లేవని చెప్పారు. దీంతో అంతటి రద్దీ ప్రదేశంలో లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ ఎలా నిర్వహిస్తున్నారో తనకు అర్థం కావట్లేదని తన ఆవేదనను తెలిపింది.

Also read: Ellyse Perry: ఎలీస్‌ పెర్రీకి ఊహించని బహుమతి.. పగిలిన కారు అద్దాన్ని..!

ఇక ఆ రెస్టారెంట్ వంటగదికి వెళ్లి చూడగా.. అక్కడ పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని అంతేకాకుండా భరించలేని వాసన వస్తుందంటూ మండిపడింది. అంతేకాకుండా వంటగది పైకప్పు కూడా కొంత భాగం లేదని చెప్పుకొచ్చింది. ఈ విషయం సంబంధించి అధికారులు ఆ రెస్టారెంట్ పై చర్యలు తీసుకునే వరకు పోరాడుతానని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.