Anna Canteens : అన్న క్యాంటీన్లలో రేట్లు మారాయా.. లేక అలాగే ఉన్నాయా..
- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు.
- చిత్తూరు జగ్గంపేటలో మొదలైన అన్న క్యాంటిన్లు.
- పాత ధరలకే టిఫిన్ భోజనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Canteens : ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దింతో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను మరోసారి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మంచి కార్యక్రమం వల్ల చాలామంది పేదవారికి కడుపు నిండనుంది. ఇందులో భాగంగానే తాజాగా పొరపాలక శాఖ మంత్రి నారాయణ ఓ కీలక ప్రకటన చేశాడు. వచ్చే మూడు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లను ప్రారంభిస్తామని., అలాగే సెప్టెంబర్ 21 లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించేలా లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ నిర్ణయం చూస్తే అతి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం అన్న క్యాంటీన్లో మొదలు కాబోతున్నాయి.
Organ donation: పెళ్లయిన 50 రోజులకే మరణం..అవయవదానంతో అయిదుగురికి జీవం
Also Read
ఇకపోతే ఇదివరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అన్న క్యాంటీన్లో కేవలం ఐదు రూపాయలకే భోజనం పెట్టేవారు. అంతేకాదు టిఫిన్ కూడా అదే రేటుకు అందించేవారు. కొత్తగా తెరిచే అన్న క్యాంటీన్లో రేట్లు ఎలా ఉండబోతున్నాయని చాలామందిలో చర్చ జరుగుతోంది. ఇదివరకు రేట్లే ఉంటాయా..? లేదంటే..? అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా తెరవబోయే అన్న క్యాంటీన్లో కేవలం ఐదు రూపాయలకే టిఫిన్, ఐదు రూపాయలకే భోజనం లభించనుంది. దీంతో కేవలం 10 రూపాయలకే రెండు పూటలా కడుపునిండా తినవచ్చు. అంటే పేదవారిక అన్న క్యాంటీన్లో ఫుడ్ ను అతి తక్కువ ధరకే అందించనున్నారు.
Pavitra Gowda: పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటిల్ కి తరలింపు!
ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్ మొదలైంది. అక్కడ టిఫిన్ తో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా కేవలం సపరేటుగా ఐదు రూపాయలకే అందిస్తున్నారు. అలాగే జగ్గంపేటలోని టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించే అన్న క్యాంటీన్ కూడా పునః ప్రారంభమైంది. జూన్ 19 నుంచి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు పూర్తిస్థాయిలో మొదలు కాబోతున్నాయి. వచ్చే నెలాఖరులోపు ఈ క్యాంటిన్లకు సంబంధించి మూడు పూటల భోజనం సరఫరా చేసేందుకు ఏజెన్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత ఏజెన్సీలు ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత క్యాంటీన్ భవన నిర్మాణం, అలాగే కొత్త పరికరాలు, అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్, అలాగే మౌలిక సదుపాయాలను తీసుకోబడతాయి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!