Andhra Pradesh: ఈత సరదా.. రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు గల్లంతు
- ఇద్దరి యువకుల ప్రాణాల మీదకు తెచ్చిన ఈత సరదా
- ఆంధ్రప్రదేశ్లో రెండు వేర్వేరు చోట్ల ప్రమాదం
- ఇద్దరు యువకులు గల్లంతు
- విశాఖ ఆర్కే బీచ్లో ఓ యువకుడు గల్లంతు
- అన్నమయ్య జిల్లా గండిమడుగు నదిలో ఓ యువకుడు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈత సరదా ఇద్దరి యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని ఆర్కే బీచ్లో విషాదం నెలకొంది. కొందరు ఇంటర్మీడియట్ విద్యార్థులు సరదాగా ఆర్కే బీచ్కు వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానానికి దిగారు. మొత్తం 11 మంది విద్యార్థులు బీచ్కు రాగా.. అందులో ఆరుగురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. అయితే సముద్రంలో అలల ధాటికి నిఖిల్ (18) అనే విద్యార్థి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో.. విద్యార్థి నిఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి కోసం వెతికే పనిలో పడ్డారు.
Read Also: Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మరోవైపు.. అన్నమయ్య జిల్లా గాలివీడులో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం స్నేహితులతో కలిసి గండిమడుగు నది వద్దకు వెళ్లిన ఓ యువకుడు.. నదిలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. దీంతో.. యువకుడు ఆచూకీ కోసం అగ్నిమాపక, పోలీసు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గంటల తరబడి నదిలో ముమ్మరంగా గాలించి యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడు బీహార్కు చెందిన ధీరజ్ కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. మృతుడు వెలిగల్లు సోలార్ పవర్ ప్లాంట్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Ola Electric: ఓలా నుంచి 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్.. తక్కువ ధరలోనే
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..