Heatwave Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాలకు ఐఎండీ తాజా హెచ్చరికలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. తీవ్రమైన వేడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ లిస్టును విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: NBK 109: బాలయ్య-బాబీ సినిమా టైటిల్ ఇదే?
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ఏప్రిల్ 3 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీలో రాయలసీమ, కోస్తాంధ్రలో వేడి గాలులు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. రాత్రి వేళలో వేడితో పాటు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. అయితే ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్ 7 వరకు మెరుగైన వర్షపాతం, ఉరుములతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఒడిశాలో ఏప్రిల్ 3-6 మధ్య, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 4-6 మధ్య, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తా, యానాంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశాలో మాత్రం రాత్రిపూట వెచ్చని పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Vizag: సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు.. ఆచూకీ కోసం గాలింపు
ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో వేడితో పాటు తేమ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 2-4 మధ్య కాలంలో తెలంగాణలో కూడా వేడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. రాబోయే 3 రోజుల్లో వాయువ్య మరియు తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 ° C వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2°C వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వేడి వాతావరణం అధికంగా ఉండే ఛాన్సుందని హెచ్చరించింది. ఈ సంవత్సరం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటామని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వేడి పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని.. అందుకు తగిన విధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Atishi: లోక్సభ ఎన్నికల ముందు మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్..
తాజావార్తలు
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!