Heatwave Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాలకు ఐఎండీ తాజా హెచ్చరికలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. తీవ్రమైన వేడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ లిస్టును విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: NBK 109: బాలయ్య-బాబీ సినిమా టైటిల్ ఇదే?
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఏప్రిల్ 3 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీలో రాయలసీమ, కోస్తాంధ్రలో వేడి గాలులు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. రాత్రి వేళలో వేడితో పాటు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. అయితే ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్ 7 వరకు మెరుగైన వర్షపాతం, ఉరుములతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఒడిశాలో ఏప్రిల్ 3-6 మధ్య, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 4-6 మధ్య, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తా, యానాంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశాలో మాత్రం రాత్రిపూట వెచ్చని పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Vizag: సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు.. ఆచూకీ కోసం గాలింపు
ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో వేడితో పాటు తేమ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 2-4 మధ్య కాలంలో తెలంగాణలో కూడా వేడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. రాబోయే 3 రోజుల్లో వాయువ్య మరియు తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 ° C వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2°C వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వేడి వాతావరణం అధికంగా ఉండే ఛాన్సుందని హెచ్చరించింది. ఈ సంవత్సరం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటామని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వేడి పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని.. అందుకు తగిన విధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Atishi: లోక్సభ ఎన్నికల ముందు మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!