IMD Alert: తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD Alert: రానున్న మూడు రోజుల్లో తమిళనాడులోని 18కి పైగా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా తమిళనాడులోని 18 జిల్లాలకు పైగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఒక ప్రకటనలో తెలిపింది. కన్యాకుమారిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు తమిళనాడులోని తిరునెల్వేలి, తెన్కాసి, తేని జిల్లాల్లో రామనాథపురం, విరుదునగర్, తూత్తుకుడి, మధురై, దిండిగల్, తిరుపూర్, కోయంబత్తూరు, నీలగిరి, తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాల్లో వర్ష హెచ్చరిక జారీ చేయబడింది.
Read Also: Ram Charan: గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయ్యేదెప్పుడో శంకరా…
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
నవంబర్ 22న తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాసి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు, కారైకల్ ప్రాంతంలోని రామనాథపురం, తూత్తుకుడి, తేని, దిండిగల్, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Read Also: Minister KTR: నేడు నాలుగు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో..
చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న కాంచీపురం జిల్లాలో ఒక మోస్తరు ఎండలు ఉంటాయి. వెంటనే అకస్మాత్తుగా చీకటి మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. చివరికి భారీ వర్షం కురిసింది. కాంచీపురంతో పాటు వాలాజాబాద్, ఉతిరమేరూర్, చెన్నై బెంగళూరు జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లో ఈరోజు 30 నిమిషాలకు పైగా భారీ వర్షం కురిసిందని చెన్నై ఆర్ఎంసి తెలిపింది. నవంబర్ 22, 23 తేదీలలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే నాగపట్నం, కాంచీపురం,చెంగల్ పట్టు జిల్లాల్లోని స్కూల్స్ కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!