Site icon NTV Telugu

Ignoring Social Media : రోజుకు 15 నిమిషాలు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.. మీ ఆరోగ్యం సేఫ్..!

Social Media

Social Media

రోజులో మీరు ఒత్తిడికి గురవుతున్నారా.. మీకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తున్నాయా.. అయితే మీ ఫోన్ ను పక్కన పెట్టాల్సిందే.. ఈ విషయాన్ని స్వయంగా నిపుణులే చెబుతున్నారు. స్వాన్సీ విశ్వవిద్యాలయం నుంచి ఒక కొత్త అధ్యయనం ప్రకారం సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకు కేవలం 15 నిమిషాలు తగ్గించడం వలన సాధారణ ఆరోగ్యం మరియు రోగనిరోధక పని తీరు మెరుగుపడటమే కాకుండా, నిరాశ మరియు ఒంటరితనం యొక్క లక్షణాలను కూడా మెరుగుపరుస్తుంది.

Also Read : Russia: ఐఫోన్లు పడేయండి లేదా మీ పిల్లలకు ఇవ్వండి.. అధికారులకు అధ్యక్ష భవనం ఆదేశాలు..

మూడు నెలల పాటు, రీడ్, టెగాన్ ఫౌక్ప్ మరియు మరియం ఖేలా ప్రజలు తమ సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకు 15 నిమిషాలు తగ్గించినప్పుడు శారీరక ఆరోగ్యం మరియు మానసిక పనితీరుపై ప్రభావాలను పరిశీలించారు. 50 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 20-25 సంవత్సరాల వయస్సు గలవారిని మూడు గ్రూపులుగా విభజించి వారి అలవాట్లలో ఏమి మార్పులు చేయకుండానే రోజుకు 15 నిమిషాలు ఫోన్ లో సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకునేలా చేశారు.

Also Read : Bhatti Vikramarka: భట్టి పీపుల్స్‌ మార్చ్‌ కు నేడు విరామం.. కారణం ఇదే..

అదే క్రమంలో సోషల్ మీడియాను ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై నివేదికలతో పాటు వారి ఆరోగ్యం మరియు మానసిక పనితీరు గురించి నెలవారీ ప్రశ్నావళికి కూడా సమాధానాలను సేకరించారు. రోజులో 15 నిమిషాల పాటు ఫోన్ కార్యకాలాపాలకు దూరంగా ఉన్నవారు, ఇతర ఫోన్లో రోజువారిగా సోషల్ మీడియాలో గడిపే సమూహాలతో పోలిస్తే సాధారణ ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, ఒంటరితనం మరియు నిరాశలో గణనీయమైన మెరుగుదల ఉన్నట్లు పరిశోధకులు కనుగోన్నారు.

Also Read : Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. పక్కా పాన్ ఇండియా లెవల్

ప్రజలు తమ సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకున్నప్పుడు, వారి శారీరక ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు కోసం ప్రయోజనాలతో సహా వారి జీవితాలు అనేక విధాలుగా మెరుగుపడతాయని ఈ డేటా నిరూపిస్తుంది అని అధ్యయనం నిర్వహించిన స్వాన్సీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సైకాలజీకి చెందిన ప్రొఫెసర్ ఫిల్ రీడ్ తెలిపారు.

Exit mobile version