IPL 2025: 500 పరుగులు చేస్తే చాలు.. యువ క్రికెటర్లకు సురేశ్ రైనా కీలక సూచన!
- భారత ఆటగాళ్లకు ఐపీఎల్ మంచి అవకాశం
- ఐపీఎల్ ద్వారా కుర్రాళ్లకు జాతీయ జట్టులో అవకాశం
- యువ క్రికెటర్లకు సురేశ్ రైనా సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ జట్టులోకి రావాలనుకొనే భారత యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చక్కటి అవకాశం. ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన జాబితా చాలానే ఉంది. సీనియర్లతో పాటు యువ క్రికెటర్లలో కూడా చాలా మంది ఐపీఎల్ ద్వారానే టీమిండియాలోకి వచ్చారు. యువ క్రికెటర్లలో శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్లు ఐపీఎల్ ద్వారానే జట్టులోకి వచ్చారు. కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ఎంతో మందికి జాతీయ జట్టులో అవకాశాలు కల్పించింది. ఐపీఎల్ ద్వారా కుర్రాళ్లకు జాతీయ జట్టులో అవకాశం రావడంపై భారత మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా స్పందించాడు.
కుర్రాళ్లు ఐపీఎల్లో రాణిస్తే జాతీయ జట్టులో చోటు ఖాయమని సురేశ్ రైనా పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం చాలా మంది యువ క్రికెటర్లు అద్భుతమైన టాలెంట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నారు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024ను గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా కూడా నిలిచింది. యువ క్రికెటర్లు కెప్టెన్లుగా ఎదుగుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కొందరు ఫాస్ట్ బౌలర్లను చూస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తతరం క్రికెటర్లను మనం చూస్తున్నాం. తిలక్ వర్మ , యశస్వి జైస్వాల్, రింకు సింగ్.. మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లు వస్తున్నారు. అక్షర్ పటేల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇది భారత జట్టుకు మంచిది’ అని రైనా అన్నాడు.
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
‘యువ క్రికెటర్లకు ఓ సూచన. వర్తమానంలో ఉండి ఆటపై దృష్టి పెడితే అవకాశాలు అవే వస్తాయి. నిలకడగా ఆడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది. ఒక ఐపీఎల్ సీజన్లో 500కు పైగా పరుగులు చేస్తే తప్పకుండా జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. ప్రతి ఐపీఎల్ సీజన్ను సద్వినియోగం చేసుకోవాలి. నిర్భయంగా ఆడుతూ.. టెక్నిక్తో పాటు యాటిట్యూడ్ను మెరుగుపర్చుకోవాలి. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో సత్తా చాటితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. భారత ఆటగాళ్లకు ఐపీఎల్ మంచి అవకాశం. ప్రతి ఒక్క యువ క్రికెటర్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’ అని సురేశ్ రైనా సూచించాడు.
తాజావార్తలు
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..