SRH Vs KKR: వర్షం కారణంగా క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ఇప్పుడు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. గ్రూప్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్లోని తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్-1 మంగళవారం (మే 21) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడనున్నాయి. అదే మోడీ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక్కడ మే 13న గుజరాత్ టైటాన్స్ (జీటీ), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీని తర్వాత, మే 16న, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే వీటన్నింటి మధ్య ఇప్పుడు క్వాలిఫయర్-1లో వర్షం కురిసి మ్యాచ్ను రద్దు చేస్తే ఎలా ఉంటుందోనని అభిమానులు భయపడుతున్నారు.
READ MORE: Jaya Badiga: అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
క్వాలిఫయర్-1 సమయంలో వర్షం పడితే.. అంపైర్లు 5-5 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ సాయంతో ఫలితం రాబట్టే ప్రయత్నం చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే, మ్యాచ్ రద్దు చేయబడినట్లు పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో.. పాయింట్ టేబుల్ ప్రకారం విజేతను ప్రకటిస్తారు. అంటే గ్రూప్ దశ తర్వాత చివరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ క్వాలిఫయర్-1లో కోల్కతా విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే అది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్-1 మాదిరిగానే ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లో కూడా వర్షం కురిస్తే అదే నిబంధనల ప్రకారం.. విజేతను నిర్ణయిస్తారు. అయితే ఫైనల్కు సంబంధించిన నిబంధనలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. అయితే గతేడాది ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకి చేరుకుంది. బహుశా ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడితే రిజర్వ్ డేను ఉపయోగించుకోవచ్చు. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. అంటే ఆ రోజు రిజల్ట్ ప్రకటించకపోతే మే 27న ఫైనల్ నిర్వహించవచ్చు.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!