SRH Vs KKR: వర్షం కారణంగా క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ఇప్పుడు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. గ్రూప్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్లోని తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్-1 మంగళవారం (మే 21) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడనున్నాయి. అదే మోడీ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక్కడ మే 13న గుజరాత్ టైటాన్స్ (జీటీ), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీని తర్వాత, మే 16న, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే వీటన్నింటి మధ్య ఇప్పుడు క్వాలిఫయర్-1లో వర్షం కురిసి మ్యాచ్ను రద్దు చేస్తే ఎలా ఉంటుందోనని అభిమానులు భయపడుతున్నారు.
READ MORE: Jaya Badiga: అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
క్వాలిఫయర్-1 సమయంలో వర్షం పడితే.. అంపైర్లు 5-5 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ సాయంతో ఫలితం రాబట్టే ప్రయత్నం చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే, మ్యాచ్ రద్దు చేయబడినట్లు పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో.. పాయింట్ టేబుల్ ప్రకారం విజేతను ప్రకటిస్తారు. అంటే గ్రూప్ దశ తర్వాత చివరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ క్వాలిఫయర్-1లో కోల్కతా విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే అది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్-1 మాదిరిగానే ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లో కూడా వర్షం కురిస్తే అదే నిబంధనల ప్రకారం.. విజేతను నిర్ణయిస్తారు. అయితే ఫైనల్కు సంబంధించిన నిబంధనలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. అయితే గతేడాది ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకి చేరుకుంది. బహుశా ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడితే రిజర్వ్ డేను ఉపయోగించుకోవచ్చు. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. అంటే ఆ రోజు రిజల్ట్ ప్రకటించకపోతే మే 27న ఫైనల్ నిర్వహించవచ్చు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!