SRH Vs KKR: వర్షం కారణంగా క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ఇప్పుడు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. గ్రూప్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్లోని తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్-1 మంగళవారం (మే 21) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడనున్నాయి. అదే మోడీ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక్కడ మే 13న గుజరాత్ టైటాన్స్ (జీటీ), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీని తర్వాత, మే 16న, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే వీటన్నింటి మధ్య ఇప్పుడు క్వాలిఫయర్-1లో వర్షం కురిసి మ్యాచ్ను రద్దు చేస్తే ఎలా ఉంటుందోనని అభిమానులు భయపడుతున్నారు.
READ MORE: Jaya Badiga: అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
క్వాలిఫయర్-1 సమయంలో వర్షం పడితే.. అంపైర్లు 5-5 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ సాయంతో ఫలితం రాబట్టే ప్రయత్నం చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే, మ్యాచ్ రద్దు చేయబడినట్లు పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో.. పాయింట్ టేబుల్ ప్రకారం విజేతను ప్రకటిస్తారు. అంటే గ్రూప్ దశ తర్వాత చివరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ క్వాలిఫయర్-1లో కోల్కతా విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే అది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్-1 మాదిరిగానే ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లో కూడా వర్షం కురిస్తే అదే నిబంధనల ప్రకారం.. విజేతను నిర్ణయిస్తారు. అయితే ఫైనల్కు సంబంధించిన నిబంధనలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. అయితే గతేడాది ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకి చేరుకుంది. బహుశా ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడితే రిజర్వ్ డేను ఉపయోగించుకోవచ్చు. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. అంటే ఆ రోజు రిజల్ట్ ప్రకటించకపోతే మే 27న ఫైనల్ నిర్వహించవచ్చు.
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!