SRH Vs KKR: వర్షం కారణంగా క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ఇప్పుడు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. గ్రూప్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్లోని తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్-1 మంగళవారం (మే 21) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడనున్నాయి. అదే మోడీ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక్కడ మే 13న గుజరాత్ టైటాన్స్ (జీటీ), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీని తర్వాత, మే 16న, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే వీటన్నింటి మధ్య ఇప్పుడు క్వాలిఫయర్-1లో వర్షం కురిసి మ్యాచ్ను రద్దు చేస్తే ఎలా ఉంటుందోనని అభిమానులు భయపడుతున్నారు.
READ MORE: Jaya Badiga: అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ
Also Read
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
క్వాలిఫయర్-1 సమయంలో వర్షం పడితే.. అంపైర్లు 5-5 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ సాయంతో ఫలితం రాబట్టే ప్రయత్నం చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే, మ్యాచ్ రద్దు చేయబడినట్లు పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో.. పాయింట్ టేబుల్ ప్రకారం విజేతను ప్రకటిస్తారు. అంటే గ్రూప్ దశ తర్వాత చివరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ క్వాలిఫయర్-1లో కోల్కతా విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే అది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్-1 మాదిరిగానే ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లో కూడా వర్షం కురిస్తే అదే నిబంధనల ప్రకారం.. విజేతను నిర్ణయిస్తారు. అయితే ఫైనల్కు సంబంధించిన నిబంధనలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. అయితే గతేడాది ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకి చేరుకుంది. బహుశా ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడితే రిజర్వ్ డేను ఉపయోగించుకోవచ్చు. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. అంటే ఆ రోజు రిజల్ట్ ప్రకటించకపోతే మే 27న ఫైనల్ నిర్వహించవచ్చు.
తాజావార్తలు
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్బస్టర్!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!