Chandrababu : అమరావతి రాజధానిగా ఉండింటే.. తెనాలి అభివృద్ధి ఇంకా బాగుండేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఐదేళ్ళ లో బాగుపడిన వర్గాలు ఎవరు లేరని.. ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టో తో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. “ప్రభుత్వం అంటే ప్రజలకు ఆమోదయోగ్యం అయిన ప్రభుత్వం ఉండాలి.. సంక్షేమం ,అభివృద్ధి కలగలసి ఉండాలి. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే, తెనాలి అభివృద్ధి ఇంకా బాగుండేది. గతం లో రాజకీయాలు హుందా గా ఉండేవి. ఇప్పుడు ఉన్న సీఎం అహంకారం కలిగిన వ్యక్తి. ప్రభుత్వ డబ్బుతో ప్రజా వేదిక కడితే, ఆ వేదిక కూల్చి విధ్వంసం కర పాలనకు తెరదీశాడు. ఊరూరు తిరిగి ముద్దులు పెట్టిన జగన్ దెబ్బకు ప్రజలు కరిగి పోయారు. కృష్ణ డెల్టాకు నీరిద్దామని, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుల ను మూల పెట్టారు. పవన్ కళ్యాణ్ ను చులకనగా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తులను, శాశ్వతంగా మూల కూర్చోబెట్టాలి.
READ MORE: Monditoka Jaganmohan Rao: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మొండితోక జగన్మోహన్ రావు
Also Read
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
పవన్ కళ్యాణ్, నేను కష్టపడేది, ప్రజల కోసమే ప్రజలకు గెలవాలని కష్టపడుతున్నామని చంద్రబాబు అన్నారు. తెనాలి సభలో ఆయన మాట్లాడుతూ.. “ఆంధ్ర పారిస్ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. తెలివిగా నిర్ణయం తీసుకొని, ఓటు వేయండి. రేపటినుండి, ప్రచారానికి వచ్చిన, టీడీపీ, జనసేన నాయకులకు, మీ సెల్ ఫోన్ టార్చ్ లైట్, వెలుగులతో స్వాగతం పలకండి. మా భవిష్యత్తుకు ఓటు వేయమని మీ తల్లిదండ్రులకు చెప్పండి. వైసీపీ విముక్త రాష్ట్రం కోసమే, పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు. టీడీపీ, జనసేన, అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించాలి. టీడీపీ హయంలో సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది. ఐదు రూపాయలకి ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతుంటే సహించలేదు. రంజాన్ తోఫాలు ఇచ్చేవాళ్ళం. ముస్లిం యువతుల పెళ్లిలకు, దుల్హన్ పథకం ద్వారా డబ్బులు ఇచ్చేవాళ్లం. మసీదులకు ఆర్థిక సాయం చేశాం. పార్లమెంట్లో బిల్లులకు జగన్ రహస్తి ఒప్పందాలు చేసుకున్నారు. నాకు రహస్య ఒప్పందాలు ఉండవు. ఆ మేనిఫెస్టోలో మైనారిటీ డిక్లరేషన్ కూడా చేశా. మళ్ళీ వైసీపీ, అధికారంలోకి వస్తే ఈ వ్యాపారాల్లో వాటాలు అడుగుతారు. జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ..తో ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. జగన్ మేనిఫెస్టో వెలవెలబోతుంది , టిడిపి మేనిఫెస్టో కళకళలాడుతుంది. నాకు సంపద సృష్టిస్తానన్న నమ్మకం ఉంది. అందుకే మేనిఫెస్టోలో సంక్షేమ కార్యక్రమాల పంట పండించా.” ‘
- Tags
- AP Elections
- bjp
- cbn
- jagan
- janasena
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!