COVID19: షాకింగ్ సర్వే.. కరోనా నుంచి కోలుకున్న ప్రతి వందమందిలో ఆరుగురు ఏడాదిలోపే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID19: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా మహమ్మారి. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పొయారు. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చాలా మంది చనిపోయారు. తక్కువ శాతం మంది మాత్రమే కోలుకొని ఇంటికి తిరిగివచ్చారు. అయితే కోలుకున్న వారిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జరిపిన సర్వేలే షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ తాజాగా ఓ పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది. కాగా ఇండియన్ మెడికల్ జర్నల్ ఈ రీసెర్చ్ రిపోర్టును ప్రచురించింది. దానిలో ఉన్న వివరాల ప్రకారం ఆసుపత్రులలో చేరి కోలుకున్న 14,419 మంది కరోనా రోగులను ఈ సర్వేలో పరీక్షించారు. వారిని నాలుగు వారాల నుంచి ఏడాది పాటు ఐసీఎంఆర్ నిపుణులు పరిశీలించారు. అయితే ఇక్కడే వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది.
Also Read: Sony Xperia 5 V: మార్కెట్లోకి రానున్న సోనీ ఎక్స్ పీరియా 5 వీ.. ఫీచర్లు ఇవే
Also Read
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ఈ పరిశోధన ఫలితంగా డిశార్జ్ అయ్యి ఇంటికి చేరిన వారిలో 942 మంది అంటే 6.5% మంది ఏడాదిలోపే చనిపోయినట్లుగా తెలిసింది. అంటే సగటున ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన 28 రోజులకు చనిపోయినట్లుగా గుర్తించినట్లు ఐసీఎంఆర్ రిపోర్ట్ పేర్కొంది.అయితే ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన వారిలో 27.4 శాతం మంది కనీసం ఒక్క డోసు టీకా అయినా తీసుకున్న వారేనని వెల్లడించింది. ఇక దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడుతున్న వారే చనిపోయిన వారిలో 73 శాతం మంది ఉన్నారని రిపోర్ట్ వివరాల బట్టి చూస్తే అర్థం అవుతుంది. దీనిని బట్టి పరిశీలిస్తే కరోనా నుంచి బయట పడినా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఎక్కువ ముప్పు ఉందని అర్థం చేసుకోవచ్చు. అందుకే కరోనా నుంచి బయట పడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఇదిలా వుండగా వైరస్ బారిన పడకముందే కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణాపాయం కొంత తగ్గే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పరిశోధకులు తెలిపారు.ఇక కరోనా మహమ్మారి కారణంగా చైనాలో రెండు నెలల్లో 20 లక్షల మంది మరణించారనే వార్త ఇటీవల కాలంలో తీవ్ర ఆవేదనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. తాజా కరోనా వైరస్ కొత్త వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. కరోనా డేటాను ఇవ్వాలని కూడా ప్రపంచ దేశాలను కోరుతుంది.
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!