ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతుంటే, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీసుకున్న కఠిన నిర్ణయాలు ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాయి. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాక్కు, ఇప్పుడు ఐసీసీ ‘డబుల్ షాక్’ ఇచ్చింది.
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టెస్టులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టుల్లో పాకిస్థాన్కు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. అయితే.. ఈ ఓటమి బాధలో ఉన్న పాక్పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు గానూ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె భారీ జరిమానా విధించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టుకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 8 పాయింట్ల కోత విధించారు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న పాక్కు, ఈ పాయింట్ల కోత ఫైనల్ అవకాశాలను మరింత సంక్లిష్టంగా మార్చేసింది.
అంతే కాకుండా.. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 30 నుండి 40 శాతం వరకు జరిమానా విధించారు. మైదానంలో ఆటగాళ్లు సమయాన్ని వృధా చేయడం తీవ్రమైన తప్పిదంగా పరిగణించిన ఐసీసీ, కెప్టెన్ షాన్ మసూద్తో పాటు జట్టు సభ్యులందరికీ ఈ పెనాల్టీని వర్తింపజేసింది.
బంగ్లాదేశ్కు కూడా షాక్..
కేవలం పాకిస్థాన్కే కాకుండా, విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టుకు కూడా ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు కూడా మూడు ఓవర్ల స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో, బంగ్లాదేశ్కు 3 డబ్ల్యూటీసీ పాయింట్ల కోతతో పాటు 15 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత నిరాశాజనకమైన దశగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వైఫల్యం, మరోవైపు క్రమశిక్షణా రాహిత్యం ఆ జట్టు ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. రానున్న మ్యాచ్ల్లో పాక్ జట్టు తన వ్యూహాలను మార్చుకోకపోతే, టెస్ట్ ఛాంపియన్షిప్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!