ICC Elite Panel: ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్స్ జాబితా.. భారత్ నుంచి ఇద్దరికి చోటు!
- ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్స్ జాబితా రిలీజ్
- భారత్ నుంచి ఇద్దరికి చోటు
- ఆరు సంవత్సరాలుగా ఎలైట్ ప్యానెల్లో నితిన్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ అంపైర్స్ జాబితా రిలీజ్ అయింది. 2025-26 సీజన్కు 12 మందితో కూడిన ఎలైట్ అంపైర్ల ప్యానెల్ జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. భారత్కు చెందిన నితిన్ మేనన్ తన స్థానాన్ని నిలుపుకున్నారు. జోల్ విల్సన్ (ట్రినిడాడ్), మైకెల్ గాఫ్ (ఇంగ్లండ్)లకు ప్యానెల్లో చోటు దక్కలేదు. ఈ ఇద్దరి స్థానాల్లో అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్), అలాహుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా)లకు ఐసీసీ చోటు కల్పించింది. మరోవైపు భారత్కు చెందిన జయరామన్ మదన్గోపాల్కు ఎమర్జింగ్ ప్యానెల్లో స్థానం దక్కింది.
మధ్యప్రదేశ్కు చెందిన 41 ఏళ్ల నితిన్ మేనన్ ఆరు సంవత్సరాలుగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఉన్నారు. 2019లో మొదటిసారి ఎలైట్ ప్యానెల్కు ఎంపికైనపుడు.. భారత్ నుండి ఎలైట్ ప్యానెల్లో భాగమైన మూడవ వ్యక్తిగా నిలిచారు. నితిన్ భారత దేశవాళీలో రెండు లిస్ట్ A మ్యాచ్లు ఆడారు. 2007లో 23 సంవత్సరాల వయస్సులోనే అంపైరింగ్ తన వృత్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 2017లో కాన్పూర్లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు పురుషుల విభాగంలో 30 టెస్టులు, 60 వన్డేలు, 50 టీ20ల్లో.. మహిళల విభాగంలో 20 టీ20ల్లో అంపైర్గా విధులు నిర్వర్తించారు.
Also Read
Also Read: Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
ఐసీసీ ఎలైట్ ప్యానెల్:
ధర్మసేన (శ్రీలంక), గఫానీ (న్యూజిలాండ్), హోల్డ్స్టాక్ (దక్షిణాఫ్రికా), రిచర్డ్ ఇల్లింగ్వర్త్ (ఇంగ్లండ్), కెటిల్బరూ (ఇంగ్లండ్), నితిన్ మేనన్ (భారత్), అల్లాహుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా), ఎహ్సాన్ రజా (పాకిస్థాన్), పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా), షాహిద్ (బంగ్లాదేశ్) రాడ్నీ టకర్ (ఆస్ట్రేలియా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్).
తాజావార్తలు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!