Pawan Kalyan: నేను బ్రతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను
ఈ నేల మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడినని.. ప్రజలను కాపాడుకోవాలని అనుకునేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాగునీటి కాలువలలో పూడికబెట్టిన ప్రభుత్వం ఇదని.. పూడిక తీయలేని ఇరిగేషన్ శాఖ ఈ రాష్ట్రంలో ఉందని విమర్శించారు. రేపల్లె లో ఆయన మాట్లాడుతూ.. “పక్క రాష్ట్రాల్లో పంటల దిగుబడి పెరుగుతుంటే, ఈ రాష్ట్రంలో మాత్రం దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల 3వేల మంది కౌలు రైతులు చనిపోయారు. చనిపోయిన రైతుల కుటుంబానికి, ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇచ్చిన పార్టీ జనసేన. రైతులకి లాభం చేకూర్చే ప్రభుత్వాలు కావాలి. నేను బ్రతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. భారత దేశ సమగ్రతకు భంగం వాటిల్లనివ్వను. అన్నం పెట్టే రైతుకు, అండగా లేని ప్రభుత్వాలు ఎందుకు. ప్రతి నియోజకవర్గంలోనూ త్రాగునీటి సమస్య ఉంది. కేంద్రం అందిస్తున్న జల్జీవన్ ప్రాజెక్టులు, ఈ ప్రభుత్వం ప్రజలకు అందించడం లేదు. సాగు తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు? సముద్ర తీరంలో ఉన్న, రేపల్లె ను పర్యాటక కేంద్రంగా తయారు చేయవచ్చు. కానీ ఈ ప్రభుత్వం పేకాటలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారు.”
READ MORE: Sajjala Ramakrishna Reddy: ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
- Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
పేకాట క్లబ్బుల మీద ఉన్న, జోరు హుషారు ప్రజా సమస్యల తీర్చడం మీద లేదని పవన అన్నారు. ఆయన మాట్లాడుతూ… “సమాజంలో బలమైన వ్యక్తుల కోసం చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి. బలహీనంగా ఉన్న వాళ్ల మీద బలమైన చట్టాలు ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా కాదా, ప్రజాస్వామ్యం గొంతు ఎత్తకపోతే బంగారు భవిష్యత్తు ఉండదు. తీర ప్రాంతానికి కోటలు లాంటి మడ అడవుల్ని కూడా కొట్టేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాలాంటి వాడు బ్రతికే ఉంటాడు. అడ్డగోడుగా మీరు దాడులు చేస్తే, తిరగబడటానికి ఒకడుంటాడు. ఉమ్మడి కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేర్చడానికి నేను బాధ్యత తీసుకుంటాను. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాల్వలో పూడికలు తీపిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ అత్యంత ప్రమాదకరం.. మీ భూమిలో మీరు లోన్ తీసుకోవాలన్న సాధ్యపడదు. ఒరిజినల్ డాక్యుమెంటో లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వవు. మీ ఇంటి బిడ్డకు పెళ్ళి చేయాలంటే, పసుపు కుంకాలు కింద డాక్యుమెంట్ లు ఇవ్వలేరు. ఇప్పటిదాకా ఏ హక్కులు లేకుండానే మన ఇళ్ల మీద పడి ఆస్తులు లాక్కుంటున్నారు. ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు మెజారిటీ అనేది చెప్పను కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చి తీరుతుంది. చిరంజీవి లాంటి వ్యక్తిని ,చంద్రబాబు లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు.”
తాజావార్తలు
-
Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?
-
MS Dhoni: “ధోనీ ఎక్కడ?”.. కనీసం డగౌట్లోనూ కనిపించని మిస్టర్ కూల్.. అసలు గుట్టు విప్పిన కోచ్
-
Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
-
NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!
-
Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!