Pawan Kalyan: నేను బ్రతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నేల మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడినని.. ప్రజలను కాపాడుకోవాలని అనుకునేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాగునీటి కాలువలలో పూడికబెట్టిన ప్రభుత్వం ఇదని.. పూడిక తీయలేని ఇరిగేషన్ శాఖ ఈ రాష్ట్రంలో ఉందని విమర్శించారు. రేపల్లె లో ఆయన మాట్లాడుతూ.. “పక్క రాష్ట్రాల్లో పంటల దిగుబడి పెరుగుతుంటే, ఈ రాష్ట్రంలో మాత్రం దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల 3వేల మంది కౌలు రైతులు చనిపోయారు. చనిపోయిన రైతుల కుటుంబానికి, ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇచ్చిన పార్టీ జనసేన. రైతులకి లాభం చేకూర్చే ప్రభుత్వాలు కావాలి. నేను బ్రతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. భారత దేశ సమగ్రతకు భంగం వాటిల్లనివ్వను. అన్నం పెట్టే రైతుకు, అండగా లేని ప్రభుత్వాలు ఎందుకు. ప్రతి నియోజకవర్గంలోనూ త్రాగునీటి సమస్య ఉంది. కేంద్రం అందిస్తున్న జల్జీవన్ ప్రాజెక్టులు, ఈ ప్రభుత్వం ప్రజలకు అందించడం లేదు. సాగు తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు? సముద్ర తీరంలో ఉన్న, రేపల్లె ను పర్యాటక కేంద్రంగా తయారు చేయవచ్చు. కానీ ఈ ప్రభుత్వం పేకాటలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారు.”
READ MORE: Sajjala Ramakrishna Reddy: ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు
Also Read
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
పేకాట క్లబ్బుల మీద ఉన్న, జోరు హుషారు ప్రజా సమస్యల తీర్చడం మీద లేదని పవన అన్నారు. ఆయన మాట్లాడుతూ… “సమాజంలో బలమైన వ్యక్తుల కోసం చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి. బలహీనంగా ఉన్న వాళ్ల మీద బలమైన చట్టాలు ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా కాదా, ప్రజాస్వామ్యం గొంతు ఎత్తకపోతే బంగారు భవిష్యత్తు ఉండదు. తీర ప్రాంతానికి కోటలు లాంటి మడ అడవుల్ని కూడా కొట్టేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాలాంటి వాడు బ్రతికే ఉంటాడు. అడ్డగోడుగా మీరు దాడులు చేస్తే, తిరగబడటానికి ఒకడుంటాడు. ఉమ్మడి కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేర్చడానికి నేను బాధ్యత తీసుకుంటాను. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాల్వలో పూడికలు తీపిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ అత్యంత ప్రమాదకరం.. మీ భూమిలో మీరు లోన్ తీసుకోవాలన్న సాధ్యపడదు. ఒరిజినల్ డాక్యుమెంటో లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వవు. మీ ఇంటి బిడ్డకు పెళ్ళి చేయాలంటే, పసుపు కుంకాలు కింద డాక్యుమెంట్ లు ఇవ్వలేరు. ఇప్పటిదాకా ఏ హక్కులు లేకుండానే మన ఇళ్ల మీద పడి ఆస్తులు లాక్కుంటున్నారు. ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు మెజారిటీ అనేది చెప్పను కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చి తీరుతుంది. చిరంజీవి లాంటి వ్యక్తిని ,చంద్రబాబు లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు.”
తాజావార్తలు
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
-
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!