Rahul Dravid Reward: నాకు రూ.5 కోట్లు వద్దు.. వారికి ఇచ్చిన ప్రైజ్మనీనే ఇవ్వండి!
- రూ.125 కోట్ల నజరానా
- రూ.5 కోట్లు వద్దు
- బోనస్ విషయంలో ద్రవిడ్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid Wants Equal Reward to Support Staff: 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులోని15 మంది ఆటగాళ్లకు రూ.5 కోట్లు చొప్పున.. రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.1 కోటి అందించింది. ఇక హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్కూ రూ.5 కోట్ల బోనస్ ఇచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్ల నజరానా దక్కింది. అయితే ద్రవిడ్ తన బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రాహుల్ ద్రవిడ్ తన బోనస్ను సగానికి తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్తో సమానంగానే తాను బోనస్ను పంచుకోవాలనుకుంటున్నాడట. రూ.5 కోట్లకు బదులుగా.. రూ.2.5 కోట్ల బోనస్ను అందించాలని బీసీసీఐని రాహుల్ కోరినట్లు వార్తలు వచ్చాయి. ‘రాహుల్ ద్రవిడ్ తన సహాయ కోచింగ్ స్టాఫ్తో సమానంగానే బోనస్ను తీసుకోవాలనుకుంటుంన్నాడు. బోనస్గా ఆయనకు రూ.5 కోట్లు వచ్చాయి. కానీ ఇతర కోచ్లకు రూ.2.5 కోట్లను బీసీసీఐ ప్రకటించింది. తనను ప్రత్యేకంగా చూడటంపై ద్రవిడ్ ఇబ్బంది పడినట్లు ఉన్నాడు. కోచింగ్ స్టాఫ్తో పాటు తనకూ రూ.2.5 కోట్ల బోనస్ను ఇవ్వాలని కోరాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం’ అని బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి.
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
2018లో భారత్ అండర్-19 ప్రపంచకప్ను గెలిచినప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్నాడు. ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్కు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ద్రవిడ్కు అత్యధికంగా రూ.50 లక్షలు ఇవ్వగా.. ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున అందించింది. ద్రవిడ్ మాత్రం అందరితో పాటు తనకూ సమానంగా బోనస్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో క్యాష్ అవార్డులను రివైజ్ చేసిన బీసీసీఐ.. కోచింగ్ స్టాఫ్కు రూ.25 లక్షల చొప్పున అందించింది. ఇప్పుడు కూడా బీసీసీఐ అలానే చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!