Rahul Dravid Reward: నాకు రూ.5 కోట్లు వద్దు.. వారికి ఇచ్చిన ప్రైజ్మనీనే ఇవ్వండి!
- రూ.125 కోట్ల నజరానా
- రూ.5 కోట్లు వద్దు
- బోనస్ విషయంలో ద్రవిడ్ కీలక నిర్ణయం
Rahul Dravid Wants Equal Reward to Support Staff: 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులోని15 మంది ఆటగాళ్లకు రూ.5 కోట్లు చొప్పున.. రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.1 కోటి అందించింది. ఇక హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్కూ రూ.5 కోట్ల బోనస్ ఇచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్ల నజరానా దక్కింది. అయితే ద్రవిడ్ తన బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రాహుల్ ద్రవిడ్ తన బోనస్ను సగానికి తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్తో సమానంగానే తాను బోనస్ను పంచుకోవాలనుకుంటున్నాడట. రూ.5 కోట్లకు బదులుగా.. రూ.2.5 కోట్ల బోనస్ను అందించాలని బీసీసీఐని రాహుల్ కోరినట్లు వార్తలు వచ్చాయి. ‘రాహుల్ ద్రవిడ్ తన సహాయ కోచింగ్ స్టాఫ్తో సమానంగానే బోనస్ను తీసుకోవాలనుకుంటుంన్నాడు. బోనస్గా ఆయనకు రూ.5 కోట్లు వచ్చాయి. కానీ ఇతర కోచ్లకు రూ.2.5 కోట్లను బీసీసీఐ ప్రకటించింది. తనను ప్రత్యేకంగా చూడటంపై ద్రవిడ్ ఇబ్బంది పడినట్లు ఉన్నాడు. కోచింగ్ స్టాఫ్తో పాటు తనకూ రూ.2.5 కోట్ల బోనస్ను ఇవ్వాలని కోరాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం’ అని బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
2018లో భారత్ అండర్-19 ప్రపంచకప్ను గెలిచినప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్నాడు. ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్కు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ద్రవిడ్కు అత్యధికంగా రూ.50 లక్షలు ఇవ్వగా.. ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున అందించింది. ద్రవిడ్ మాత్రం అందరితో పాటు తనకూ సమానంగా బోనస్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో క్యాష్ అవార్డులను రివైజ్ చేసిన బీసీసీఐ.. కోచింగ్ స్టాఫ్కు రూ.25 లక్షల చొప్పున అందించింది. ఇప్పుడు కూడా బీసీసీఐ అలానే చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!