Rahul Dravid Reward: నాకు రూ.5 కోట్లు వద్దు.. వారికి ఇచ్చిన ప్రైజ్మనీనే ఇవ్వండి!
- రూ.125 కోట్ల నజరానా
- రూ.5 కోట్లు వద్దు
- బోనస్ విషయంలో ద్రవిడ్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid Wants Equal Reward to Support Staff: 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులోని15 మంది ఆటగాళ్లకు రూ.5 కోట్లు చొప్పున.. రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.1 కోటి అందించింది. ఇక హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్కూ రూ.5 కోట్ల బోనస్ ఇచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్ల నజరానా దక్కింది. అయితే ద్రవిడ్ తన బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రాహుల్ ద్రవిడ్ తన బోనస్ను సగానికి తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్తో సమానంగానే తాను బోనస్ను పంచుకోవాలనుకుంటున్నాడట. రూ.5 కోట్లకు బదులుగా.. రూ.2.5 కోట్ల బోనస్ను అందించాలని బీసీసీఐని రాహుల్ కోరినట్లు వార్తలు వచ్చాయి. ‘రాహుల్ ద్రవిడ్ తన సహాయ కోచింగ్ స్టాఫ్తో సమానంగానే బోనస్ను తీసుకోవాలనుకుంటుంన్నాడు. బోనస్గా ఆయనకు రూ.5 కోట్లు వచ్చాయి. కానీ ఇతర కోచ్లకు రూ.2.5 కోట్లను బీసీసీఐ ప్రకటించింది. తనను ప్రత్యేకంగా చూడటంపై ద్రవిడ్ ఇబ్బంది పడినట్లు ఉన్నాడు. కోచింగ్ స్టాఫ్తో పాటు తనకూ రూ.2.5 కోట్ల బోనస్ను ఇవ్వాలని కోరాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం’ అని బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి.
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
2018లో భారత్ అండర్-19 ప్రపంచకప్ను గెలిచినప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్నాడు. ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్కు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ద్రవిడ్కు అత్యధికంగా రూ.50 లక్షలు ఇవ్వగా.. ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున అందించింది. ద్రవిడ్ మాత్రం అందరితో పాటు తనకూ సమానంగా బోనస్ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. దీంతో క్యాష్ అవార్డులను రివైజ్ చేసిన బీసీసీఐ.. కోచింగ్ స్టాఫ్కు రూ.25 లక్షల చొప్పున అందించింది. ఇప్పుడు కూడా బీసీసీఐ అలానే చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!