Hydra Commissioner: పోచారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ
- పోచారంలో హైడ్రా కూల్చివేతలు
- స్పందించిన కమిషనర్ రంగనాథ్
- పత్రికా ప్రకటన విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతల అనంతరం ప్రకటన విడుదల చేశారు. “దీప్తి శ్రీనగర్లోని 200 ఎకరాల్లో లే అవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారు. లే అవుట్ లో 2,200 ప్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. లే అవుట్ ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజ్ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లే అవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ను నిర్మించారు. రోడ్లు, డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది ప్లాట్ల యజమానుల నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారు. కేవలం రెండు ఎంట్రీ, ఎగ్జిట్లను మాత్రమే ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్ లాగా నల్లమల్లారెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. లే అవుట్లలో తమ ఓపెన్ ప్లాట్లను ఎవరైనా అమ్మలన్నా నల్ల మల్లా రెడ్డి నియంత్రిస్తారు. ప్లాట్లను విక్రయించే ఎవరైనా ముందుగా NMRని మాత్రమే సంప్రదించాలి.” అని ప్రకటనలో రంగనాథ్ పేర్కొన్నారు.
READ MORE: Noman Ali: వయసనేది జస్ట్ నెంబర్.. 38 ఏళ్ల వయసులో రికార్డ్ సృష్టించిన స్పిన్నర్ (వీడియో)
Also Read
- PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
మార్కెట్ రేటు చదరపు గజానికి 25, 000 అయితే, ఎన్ఎమ్ఆర్ చదరపు గజానికు 15000 మాత్రమే అందిస్తుంది. అలాగే ఎన్ఎమ్ఆర్ విక్రయ లావాదేవీకి ఎన్ఓసీ ఇవ్వాలి. అలాంటి ప్రతి లావాదేవీకి అతనికి 50,000 ఇవ్వాలి. లే అవుట్ లలోని 25% ప్లాట్లు ఇప్పుడు ఎన్ఎమ్ఆర్, అతని బినామీల యాజమాన్యం చేతిలో ఉన్నాయి. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నల్ల మల్లారెడ్డి కబ్జాలు చేసినట్లు ధృవీకరించారు. కాంపౌండ్ హాల్ నిర్మాణానికి సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోలేదు. గేటెడ్ కమ్యూనిటీకి మాత్రమే కాంపౌండ్ వాల్ ఉండేందుకు అనుమతి ఉంది. ఈ 4 కి.మీ కాంపౌండ్ వాల్ కారణంగా పొరుగు కాలనీలు, గ్రామాలు రోడ్లకు వెళ్లే మార్గం తెగిపోయింది. ప్రభుత్వ భూమిని ఎన్ఎమ్ఆర్ కబ్జా చేసిందనే ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుంది. హైడ్రా విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత అందరిపై కఠినమైన చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. హైడ్రా అన్ని చట్టపరమైన నిబంధనలను అనుసరించింది?” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!