Hydra Commissioner: పోచారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ
- పోచారంలో హైడ్రా కూల్చివేతలు
- స్పందించిన కమిషనర్ రంగనాథ్
- పత్రికా ప్రకటన విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతల అనంతరం ప్రకటన విడుదల చేశారు. “దీప్తి శ్రీనగర్లోని 200 ఎకరాల్లో లే అవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారు. లే అవుట్ లో 2,200 ప్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. లే అవుట్ ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజ్ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లే అవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ను నిర్మించారు. రోడ్లు, డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది ప్లాట్ల యజమానుల నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారు. కేవలం రెండు ఎంట్రీ, ఎగ్జిట్లను మాత్రమే ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్ లాగా నల్లమల్లారెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. లే అవుట్లలో తమ ఓపెన్ ప్లాట్లను ఎవరైనా అమ్మలన్నా నల్ల మల్లా రెడ్డి నియంత్రిస్తారు. ప్లాట్లను విక్రయించే ఎవరైనా ముందుగా NMRని మాత్రమే సంప్రదించాలి.” అని ప్రకటనలో రంగనాథ్ పేర్కొన్నారు.
READ MORE: Noman Ali: వయసనేది జస్ట్ నెంబర్.. 38 ఏళ్ల వయసులో రికార్డ్ సృష్టించిన స్పిన్నర్ (వీడియో)
Also Read
మార్కెట్ రేటు చదరపు గజానికి 25, 000 అయితే, ఎన్ఎమ్ఆర్ చదరపు గజానికు 15000 మాత్రమే అందిస్తుంది. అలాగే ఎన్ఎమ్ఆర్ విక్రయ లావాదేవీకి ఎన్ఓసీ ఇవ్వాలి. అలాంటి ప్రతి లావాదేవీకి అతనికి 50,000 ఇవ్వాలి. లే అవుట్ లలోని 25% ప్లాట్లు ఇప్పుడు ఎన్ఎమ్ఆర్, అతని బినామీల యాజమాన్యం చేతిలో ఉన్నాయి. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నల్ల మల్లారెడ్డి కబ్జాలు చేసినట్లు ధృవీకరించారు. కాంపౌండ్ హాల్ నిర్మాణానికి సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోలేదు. గేటెడ్ కమ్యూనిటీకి మాత్రమే కాంపౌండ్ వాల్ ఉండేందుకు అనుమతి ఉంది. ఈ 4 కి.మీ కాంపౌండ్ వాల్ కారణంగా పొరుగు కాలనీలు, గ్రామాలు రోడ్లకు వెళ్లే మార్గం తెగిపోయింది. ప్రభుత్వ భూమిని ఎన్ఎమ్ఆర్ కబ్జా చేసిందనే ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుంది. హైడ్రా విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత అందరిపై కఠినమైన చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. హైడ్రా అన్ని చట్టపరమైన నిబంధనలను అనుసరించింది?” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!