Hydra Commissioner: పోచారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ
- పోచారంలో హైడ్రా కూల్చివేతలు
- స్పందించిన కమిషనర్ రంగనాథ్
- పత్రికా ప్రకటన విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతల అనంతరం ప్రకటన విడుదల చేశారు. “దీప్తి శ్రీనగర్లోని 200 ఎకరాల్లో లే అవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారు. లే అవుట్ లో 2,200 ప్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్ తో పాటు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. లే అవుట్ ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజ్ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లే అవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ను నిర్మించారు. రోడ్లు, డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది ప్లాట్ల యజమానుల నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారు. కేవలం రెండు ఎంట్రీ, ఎగ్జిట్లను మాత్రమే ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్ లాగా నల్లమల్లారెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. లే అవుట్లలో తమ ఓపెన్ ప్లాట్లను ఎవరైనా అమ్మలన్నా నల్ల మల్లా రెడ్డి నియంత్రిస్తారు. ప్లాట్లను విక్రయించే ఎవరైనా ముందుగా NMRని మాత్రమే సంప్రదించాలి.” అని ప్రకటనలో రంగనాథ్ పేర్కొన్నారు.
READ MORE: Noman Ali: వయసనేది జస్ట్ నెంబర్.. 38 ఏళ్ల వయసులో రికార్డ్ సృష్టించిన స్పిన్నర్ (వీడియో)
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
మార్కెట్ రేటు చదరపు గజానికి 25, 000 అయితే, ఎన్ఎమ్ఆర్ చదరపు గజానికు 15000 మాత్రమే అందిస్తుంది. అలాగే ఎన్ఎమ్ఆర్ విక్రయ లావాదేవీకి ఎన్ఓసీ ఇవ్వాలి. అలాంటి ప్రతి లావాదేవీకి అతనికి 50,000 ఇవ్వాలి. లే అవుట్ లలోని 25% ప్లాట్లు ఇప్పుడు ఎన్ఎమ్ఆర్, అతని బినామీల యాజమాన్యం చేతిలో ఉన్నాయి. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నల్ల మల్లారెడ్డి కబ్జాలు చేసినట్లు ధృవీకరించారు. కాంపౌండ్ హాల్ నిర్మాణానికి సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోలేదు. గేటెడ్ కమ్యూనిటీకి మాత్రమే కాంపౌండ్ వాల్ ఉండేందుకు అనుమతి ఉంది. ఈ 4 కి.మీ కాంపౌండ్ వాల్ కారణంగా పొరుగు కాలనీలు, గ్రామాలు రోడ్లకు వెళ్లే మార్గం తెగిపోయింది. ప్రభుత్వ భూమిని ఎన్ఎమ్ఆర్ కబ్జా చేసిందనే ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుంది. హైడ్రా విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత అందరిపై కఠినమైన చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. హైడ్రా అన్ని చట్టపరమైన నిబంధనలను అనుసరించింది?” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..