HYDRA Commissioner : హైదరాబాద్‌లో పలు చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌

  • చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పరిశీలన
  • చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్‌
  • అపర్ణ హిల్‌లో మురుగు నీటిని శుద్ధిచేసి కాలువలోకి మళ్లిస్తున్న విధానంపై పరిశీలన
  • దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌.
Hydra Commissioner Av Ranganath

Hydra Commissioner Av Ranganath

HYDRA Commissioner : చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆనంద్ మల్లిగవాడ్ వివరించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్లు STP ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువలోకి మల్లిస్తున్న తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. దీప్తిశ్రీ నగర్‌లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్థానికులతో మాట్లాడారు.

Psycho killer: సైకో కిల్లర్ కథ.. స్త్రీలే టార్గెట్.. రక్తం వచ్చేలా దాడి చేస్తాడు.. కుదిరితే చంపేస్తాడు

దీప్తి శ్రీ నగర్‌లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన వారిపై హైడ్రా కమిషనర్‌కు స్థానికుల ఫిర్యాదు చేశారు. దాదాపు 5 వేల గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానిక హైడ్రా అధికారులను కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రేగులకుంట, భక్షికుంట మాదిరే నగరంలో 10 చెరువులను మొదటి దశలో అభివృద్ది పనులు చేపడతామని హైడ్రా కమిషనర్ మీడియాకు వెల్లడించారు. చెరువులతో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని రంగనాథ్ చెప్పారు.

Kailash Gahlot: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్