Sand Mafia: ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కు పాదం.. 11 వందల టన్నులు సీజ్
- ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కు పాదం.
- 11 వందల టన్నుల ఇసుక సీజ్
- పోలీసుల దాడుల్లో మొత్తం 57 మంది నిందితులను అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sand Mafia: హైదరాబాద్ నగరంలో సాండ్ మాఫియా అక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ఇసుక డంప్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 1,100 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో మొత్తం 57 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి మీద కఠిన చర్యలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను డెలివరీ చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా నిల్వ చేస్తున్న మాఫియా గుట్టు రట్టయింది. ఈ ముఠా తక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు బయటపడింది. ఇసుకను 10,000కు కొనుగోలు చేసి, 50,000లకు విక్రయించే గ్యాంగ్ అసలు ముసుగును పోలీసులు తొలగించారు.
Read Also: IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
హైదరాబాద్లో 16 ఇసుక డంప్లపై పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అక్రమ ఇసుక నిల్వలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నగరానికి ఇతర ప్రాంతాల నుంచి ఇసుక రవాణా చేస్తున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాలను పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైదరాబాద్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు అక్రమ ఇసుక వ్యాపారులను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!