Hyderabad: గోకుల్చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైకోర్టులో లుంబినీ పార్క్, గోకుల్చాట్ పేలుళ్ల కేసు విచారణకు వచ్చింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని నేరస్థులు హైకోర్టును ఆశ్రయించారు. నేరస్థుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై హైకోర్టు ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. కేసు విచారణను మరో బెంచ్కు మార్చాలన్న నేరస్థుల లాయర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్ల విచారణ వాయిదా వేసింది.
READ MORE: ప్రీ-బుకింగ్స్లో సంచలనం.. Mahindra XUV 7XOకి ఎందుకింత క్రేజ్..
Also Read
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
కాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి గతంలో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. గోకుల్చాట్, లుంబినీ పార్కులో టైమర్ బాంబులు పేల్చి 44 మంది మరణాలకు కారణమైన ఉగ్రవాదులు అనీక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో దోషి తారీఖ్ అంజూమ్కు జీవిత ఖైదు విధించింది. దీంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లైంది. దీంతో బాధితుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
READ MORE: Car On Railway Track: ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్పైకి మహీంద్రా థార్ .. కారు నడిపిన 65 ఏళ్ల వృద్ధుడు
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్లో అనీక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. మరో నిందితుడు తారీఖ్ అంజూమ్ను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. వీరంతా నేరానికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. మూడో వ్యక్తి తారీఖ్ ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయిమిచ్చినట్లు విచారణలో రుజువైంది. వీరందరిపై దేశంపై తిరుగుబాటు, హత్య, కుట్ర, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తదితర కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు ఈ మేరకు మరణ శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
-
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
-
Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి