Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hyderabad Crime Brother Kills Sister Chops Body Property Dispute Batasingaram

Hyderabad: 120 గజాల స్థలం కోసం.. అక్క అని కూడా చూడలేదు.. దారుణం..

Published Date :March 20, 2026 , 9:30 pm
By Veerababu
  • LB నగర్‌లో ఉంటున్న లీలాదేవి కుటుంబం..
  • బాటసింగారంలో ఇల్లు కట్టుకొని నివాసం..
  • తొమ్మిదేళ్ల క్రితం భర్త చనిపోయాడు..
  • 120 గజాల స్థలం కోసం అక్కను క్రూరంగా హత్య
Hyderabad: 120 గజాల స్థలం కోసం.. అక్క అని కూడా చూడలేదు.. దారుణం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని ఓ ప్రముఖ వ్యక్తి ఏనాడో చెప్పారు. నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే.. అది నిజమేనేమోనని అనిపిస్తోంది. తుచ్ఛమైన డబ్బు, ఆస్తుల కోసం సొంత వారు అని కూడా చూడకుండా అత్యంత కఠినాత్ములుగా వ్యవహరిస్తున్నారు కొంత మంది వ్యక్తులు. ఏ బంధాలు అవసరం లేదు.. డబ్బులు మాత్రమే కావాలనే విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అక్కను చంపేస్తే ఆస్తి దక్కించుకోవచ్చన్న నీచపు బుద్ధితో ఓ తమ్ముడు చేసిన దుర్మార్గమైన పని.. ఇప్పుడు మానవీయ సంబంధాలపై చర్చనీయాంశంగా మారింది. సొంత అక్కను అత్యంత దారుణంగా చంపేయడమే కాకుండా డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఇంతకీ ఆ కంత్రీ తమ్ముడు ఎవరు? ఈ కేసులో అసలేం జరిగింది?

ఈ ఘటన హైదరాబాద్‌ శివారులోని బాటసింగారంలో జరిగింది. రక్తం పంచుకు పుట్టిన అక్క అని కూడా చూడకుండా తమ్ముడు క్రూరంగా వ్యవహరించాడు. అక్కను అంతమొందించి ఘాతుకానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆమెపై నిందలు మోపాడు. ఆమె కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల లీలాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎల్‌బీ నగర్ ప్రాంతంలో నివసించేది. జీవనోపాధి కోసం వారు కిరాణా షాప్ నిర్వహించారు. అయితే కొన్నేళ్ల క్రితం సోదరుడు పప్పురాంతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బాటసింగారంలో 120 గజాల స్థలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. లీలాదేవికి తొమ్మిదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమెకి కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఆస్తి కోసం సొంత అక్కని దారుణంగా హత్య చేసాడు తమ్ముడు పప్పురామ్. కేవలం 120 గజాల స్థలం కోసం అక్కను ముక్కలు ముక్కలు చేసి క్రూరంగా హత్య చేశాడు.

ఫిబ్రవరి 28న లీలాదేవిని పప్పు రామ్ హత్య చేసి బాత్రూంలో పెట్టి లాక్ వేశాడు. ఆ తర్వాత తనకు ఏం తెలియనట్టు డ్రామా ఆడాడు. అంతే కాదు.. అక్క లీలా దేవి కూతురు, కొడుకును తీసుకుని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ పప్పు రామ్‌ను బంధువులు నిలదీయడంతో అక్క లీలాదేవి మిస్సయింది అని చెప్పాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చి మార్చి 8న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ కట్ చేస్తే.. కేసులో ఎలాంటి క్లూ పోలీసులకు దొరకలేదు. ఐతే పప్పు రామ్ కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు… తమదైన శైలిలో విచారించగా హత్యోదంతం బయటికి వచ్చింది.

ఫిబ్రవరి 28న పక్కా ప్లాన్ ప్రకారమే లీలాదేవిని తమ్ముడు పప్పు రామ్ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. పప్పు రామ్‌కు మరో ఇద్దరు సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశారు. అనంతరం డెడ్ బాడీ ముక్కలను కియా కారులో బాటసింగారంలో మజీద్‌పూర్ పెద్ద చెరువుకు తరలించారు. ఆయా బాడీ పార్టులను బ్యాగులో పెట్టి చెరువులో పడేశారు. కాళ్లను ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెరువులో వేశారు.

హత్యకు ప్రధాన కారణం ఆస్తి వివాదాలేనని పప్పురాం పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. లీలాదేవీ వద్ద బంగారం నగలు, డబ్బు ఉంది. బాటసింగారం గ్రామంలో 120 గజాల స్థలాన్ని అక్కా తమ్ముడు కలిసి కొనుగోలు చేశారు. లీలాదేవి.. తమ్ముడిని తన వాటా అడగడంతో వివాదం తలెత్తింది. దీంతో అక్కను చంపేస్తే వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదని దారుణానికి ఒడిగట్టాడు. పప్పు రామ్‌కు సాయం చేసిన రాజేష్ కుమార్, సునీల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కను చంపేస్తే.. హంతకుడవుతాడు.. కానీ ఆస్తికి యజమాని ఎలా అవుతాడు.. ఇంత చిన్న లాజిక్ ఆ తమ్ముడు ఎలా మిస్సయాడు.. అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. సొంత అక్కను కడతేర్చిన అతన్ని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abdullahpurmet Police
  • Batasingaram Crime News
  • brother kills sister for property
  • Hyderabad crime updates
  • Hyderabad murder case

తాజావార్తలు

  • Hyderabad: 120 గజాల స్థలం కోసం.. అక్క అని కూడా చూడలేదు.. దారుణం..

  • Dhurandhar 2: ధురంధర్-2 చెత్త సినిమా.. నటి తీవ్ర విమర్శలు

  • Anirudh: రేపు అనిరుధ్ ‘XV’ లైవ్ కన్సర్ట్..నిర్వాహకుల కీలక సూచనలు!

  • Security lapse at Srisailam: శ్రీశైలం ఆలయంలో భద్రతా వైఫల్యం

  • Crime News: తొందరపడి నిర్ణయాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు..!

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions