NTV Telugu Site icon

Hyderabad: విదేశాలను సిమ్ లు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

New Project (18)

New Project (18)

విదేశాలకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సభ్యులను సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేశారు. హైదరాబాదులో సిమ్ కార్డులు కొనుగోలు చేసి దుబాయ్ సింగపూర్, హాంగ్కాంగ్, కెనడా పంపుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా కంబోడియా, దుబాయ్ లకు సిమ్ కార్డ్ పంపించి సైబర్ మోసాలు పాల్పడుతుంది. కంబోడియా నుంచి లోకల్ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల చెందిన యువతని కంబోడియాకి రవాణా ఉదంతం వెలుగు చూసింది. కంబోడియాలో ఉన్న తెలుగు వాళ్లను పోలీసులు రక్షించి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముఠా పట్టుబడింది. కొనుగోలు చేసిన సిమ్ కార్డు లను దుబాయ్ లో ఉన్న విజయ్ కి పంపిస్తున్నారు. చైనీస్ కంపెనీల కోసం విజయ్ పని చేస్తున్నట్లు గుర్తించారు. చైనా కంపెనీలు ఎక్కువ ధర ఇచ్చి సిమ్ కార్డులు కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఇండియన్ సిమ్ కార్డ్స్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ సేల్స్ పేరుతోటి విక్రయాలు జరుగుతున్నాయి.

READ MORE: AP Ministers: రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు..

ముఠాలో జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభానీ (26), జీడిమెట్లకు చెందిన కె. నవీన్ (22), ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకు చెందిన ఎం. ప్రేమ్ కుమార్ అలియాస్ మైఖేల్ అలియాస్ మైక్ టిస్సన్ ఉన్నారు. వారి నుంచి113 SIM కార్డ్‌లు..మూడు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. నిందితులు వివిధ వ్యక్తులు, సంస్థల గుర్తింపులను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించారు. ఈ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తారు. ప్రధానంగా దుబాయ్ ద్వారా ఎగుమతి చేస్తున్నారు. పట్టుబడ్డ ఈ ముగ్గురు నిందితులు వివిధ రాష్ట్రాల్లోని అనేక మంది వ్యక్తులు సిమ్ కార్డ్‌లను సేకరించి..రవాణా, ఎగుమతి చేస్తున్నారు. దుబాయ్‌లోని ప్రధాన నిందితుడు విజయ్‌ వారి సహచరుల నుంచి ఈ సిమ్ కార్డులను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నాడు.