Uttarpradesh : భార్యను చంపి శవంతో మూడు రోజులున్న భర్త.. ఆఖరికి ఏమైందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో సొంత భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం ముస్సోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందినది. ఇక్కడ మద్యం షాపులో పనిచేస్తున్న భరత్ అనే ఉద్యోగి తన 51 ఏళ్ల భార్య సునీతను గొంతు కోసి హత్య చేశాడు. కానీ అతను మృతదేహాన్ని ఎక్కడా పారేయలేదు. అలా కాకుండా ఇంట్లోనే దాచాడు. అతనే మామూలుగా పనిమీద షాపుకి వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచిన మృతదేహం కుళ్లిపోవడంతో ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన వస్తోంది. ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు భర్త భరత్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా తన భార్యను గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు. సునీతను రెండో పెళ్లి చేసుకున్నట్లు భరత్ చెప్పాడు. సునీతకు కూడా ఇది రెండో పెళ్లి.
Read Also:Ram Charan: పిక్ ఆఫ్ ది డే.. ఖాన్స్ త్రయంతో గ్లోబల్ స్టార్ నాటు నాటు స్టెప్
Also Read
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
ఇద్దరికీ మొదటి వివాహం నుండి పిల్లలు ఉన్నారు. కాకపోతే వీరిద్దకీ సొంతంగా పిల్లలైతే లేరు. దంపతులు గత రెండేళ్లుగా అంబేద్కర్ నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. డబ్బు కోసం ఇద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడేవారు. భరత్ మద్యం షాపులో పనిచేసేవాడు. మద్యానికి కూడా బానిసయ్యాడు. కాగా, సునీతకు సొంత దుకాణం ఉంది. మూడు రోజుల క్రితం ఏదో విషయమై వారి మధ్య గొడవ జరిగి భరత్ సునీతను గొంతుకోసి హత్య చేశాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎప్పటిలాగే పనికి వెళ్లడం ప్రారంభించాడు. మూడు రోజుల తర్వాత అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు డయల్-112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఇంట్లో సునీత మృతదేహాన్ని గుర్తించారు. అక్కడి నుంచి తీవ్ర దుర్వాసన వస్తోంది. ప్రస్తుతం నిందితుడు భరత్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also:KCR: నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్..
తాజావార్తలు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!