Uttar Pradesh: పెళ్లాన్ని చంపాడు.. పాతి పెట్టి.. పైన కాంక్రీట్ వేశాడు.. వీడిని కోర్టు ఏం చేసిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: భార్యను హత్య చేసిన కేసులో ఓ యువకుడికి యూపీలోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. యువకుడు తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టి, కాంక్రీట్ ఫ్లోర్తో కప్పి, తన అత్తమామలను కష్టాల్లోకి నెట్టాడు. మేజిస్ట్రేట్ విచారణలో మహిళ హత్య విషయం బయటపడింది. ఈ కేసులో బుధవారం జిల్లా, సెషన్స్ జడ్జి ఓ మహిళను హత్య చేసిన యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ కేసులో కోర్టు రూ.1లక్ష 25వేలు జరిమానా కూడా విధించింది.
వివరాల్లోకి వెళితే.. ఒరై నగరం కొత్వాలికి చెందిన సర్సౌఖి గ్రామానికి చెందిన కాళీచరణ్ – ఊర్మిళ దంపతుల కూతురు వినీతను నగరంలోని నయా రాంనగర్ ప్రాంతానికి చెందిన ఖేమ్రాజ్ కుమారుడు ప్రమోద్ కుమార్కు ఇచ్చి 2011 సంవత్సరంలో పెళ్లి చేశారు. ప్రమోద్ కుమార్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. 2018కి ముందు వినీత తన తల్లి ఊర్మిళతో నిత్యం మాట్లాడుతూ ఉండేది. కానీ తర్వాత తన కూతురు సడన్ గా ఆమెతో మాట్లాడడం మానేసింది. ఎప్పుడూ ఫోన్ చేసిన అల్లుడు ప్రమోద్ ఏదో ఓ సాకు చెప్పి దాటేసేవాడు.
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
Read Also:Jawan: నయనతార అప్సెట్ అయ్యిందా? బాలీవుడ్ మీడియా బుద్ధి చూపించారు
ఇన్ని రోజులైనా కూతరు మాట్లాడకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రమోద్ను ఢిల్లీ నుంచి ఒరాయికి పిలిపించి కఠినంగా విచారించగా.. ప్రమోద్ నేరం అంగీకరించాడు. వినీతను హత్య చేసి.. తర్వాత ఇంట్లోని గదిలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని భూమిలో పూడ్చిపెట్టినట్లు ప్రమోద్ పోలీసులకు తెలిపాడు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు గదిలో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో పోలీసులకు అస్థిపంజరం కాకుండా చీర కూడా లభించింది. ఆ చీర తన కూతురు వినీతది అని ఊర్మిళ గుర్తించింది. మృతుడి తల్లి ఊర్మిళ ఫిర్యాదు మేరకు పోలీసులు 2020 జనవరి 4న ప్రమోద్పై హత్య కేసు నమోదు చేసి నిందితుడిని జైలుకు తరలించారు.
2 నెలల విచారణ అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. జిల్లా జడ్జి కోర్టులో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సాగిన విచారణలో 7 మంది వాంగ్మూలం, సాక్ష్యాధారాల ఆధారంగా, జిల్లా న్యాయమూర్తి లల్లూ సింగ్ బుధవారం ప్రమోద్ కుమార్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. ఇది కాకుండా రూ.1లక్ష 25వేలు జరిమానా విధించారు. శిక్ష ఖరారు చేసిన అనంతరం పోలీసులు ప్రమోద్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో శిక్ష పడిన అనంతరం మృతురాలు వినీత తల్లి ఊర్మిళ మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత తనకు న్యాయం జరిగిందని తెలిపారు. వినీతకు ప్రస్తుతం ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిని ఊర్మిళ పెంచుతోంది.
Read Also:Crime :గణేష్ నిమజ్జనంలో అపశృతి .. ఇద్దరు యువకులు మృతి
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!