NTV Telugu Site icon

Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్‌

Rape 1

Rape 1

తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయి అలవాటు చేసి… తరువాత డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది ఓ భార్య. నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవకృష్ణా రెడ్డి… తన స్నేహితురాలైన కర్నూలుకు చెందిన తన ఓ యువతికి గంజాయి అలవాటు చేసింది. తరచూ తన ఇంటికి తీసుకెళ్ళి తినే బిర్యానిలో గంజాయి పెట్టి అలవాటు చేసింది భార్య ప్రణవకృష్ణా రెడ్డి. అయితే.. ఆ యువతీ గంజాయి మత్తులో ఉన్నప్పుడు తన భర్త క్రిష్ణ కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించి స్వయంగా వీడియోలు తీసింది భార్య ప్రణవకృష్ణా రెడ్డి. తరువాత ఆ వీడియోలు ఫోటోలు యువతి అన్నకు, కుటుంబ సభ్యలకు పంపి డబ్బులు కోసం బ్లాక్ మెయిల్ చేయడం అలవాటు చేసుకున్నారు భార్య,భర్తలు.. అయితే వారి వేధింపులు ఎక్కవ కావడంతో ఎంఆర్ పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.. భార్య,భర్తలు ఇద్దరు గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి 5 లక్షలు కాజేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్య భర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఎంఆర్ పల్లె పోలీసులు.

Papua New Guinea: 26 మంది దారుణ హత్య.. నదిలోకి మృతదేహాలను ఈడ్చుకెళ్లిన మొసళ్లు..