భర్త బాధితులే కాదు.. ప్రస్తుత కాలంలో భార్య బాధితులు కూడా ఎక్కువై పోతున్నారు. భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. కాగా ఓ భర్త తన భార్య పై చేసిన ఆరోపణలు అందరిని షాక్ కు గురిచేశాయి. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో అధికారులకు ఒక వింత ఫిర్యాదు వచ్చింది. అది వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాధాన్ దివాస్ కింద ఒక కేసును విచారిస్తున్నప్పుడు, ఒక ఫిర్యాదుదారుడు తన భార్య రాత్రిపూట పాములాగా మారి తనను భయపెడుతుందని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు.
Also Read:BRS in Bus Protest: పెరిగిన టికెట్ ధరలు.. బస్సెక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..
ఈ సంఘటన సీతాపూర్లోని మహ్మదాబాద్ తహసీల్లో చోటుచేసుకుంది. శనివారం తీర్మాన దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అక్కడికి చేరుకున్న ఒక వ్యక్తి అందరినీ షాక్కు గురిచేశాడు. తన భార్య పాముగా మారిందని తెలిపాడు. ఈ కేసు సీతాపూర్లోని మహముదాబాద్ తహసీల్లోని లోధాసా గ్రామంలో చోటుచేసుకుంది. మేరాజ్, రాజ్పూర్ నివాసి నసీమున్ను వివాహం చేసుకున్నాడు.
Also Read:SSMB29 : జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేశ్ -ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!
శనివారం జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ముందు హాజరైన మెరాజ్, తన భార్య మానసిక అనారోగ్యానికి గురైందని, రాత్రిపూట పాములా నటించి తనను భయపెడుతుందని, నిద్రపోకుండా చేస్తుందని ఫిర్యాదు చేశాడు. “ఆమె తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసని ఆరోపించాడు. అయినప్పటికీ వారు బలవంతంగా వివాహం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు” అని అన్నాడు. ఫిర్యాదుదారుడి దరఖాస్తు ఆధారంగా, అధికారులు ఈ విషయాన్ని పరిష్కరించాలని కొత్వాలి పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
