Sanatan Dharma: “ఇంకెంత దిగజారిపోతారు”.. సోనియాగాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatan Dharma: సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఆయన వ్యాఖ్యలపై ఫైర్ అవుతోంది. డీఎంకే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటంతో కాంగ్రెస్ కూడా విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందనేంటని..? బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం తాము అన్ని మతాలను, విశ్వసాలను గౌరవిస్తానని చెబుతోంది. పలువురు జాతీయస్థాయి నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి హిందువులంటే ద్వేషం అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Khalistan: “మీ కోసం వస్తున్నాం”.. భారత నాయకులకు ఖలిస్తానీల బెదిరింపు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇదిలా ఉంటే ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ సీనియర్ యనేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. మౌనం అంగీకరానికి సూన అంటూ విమర్శలు గుప్పించారు. సనానత సంప్రదాయం పట్ల బీజేపీ గర్విస్తోందని, కుల, మతాలకు అతీతంగా అందరికి సమాన అవకాశాలను కల్పిస్తోందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ మౌనంగా ఉండటం దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
ఓట్లు పొందడానికి మీరు ఇంత దిగజారిపోవాలా..? అంటూ ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించాలని సోనియాగాంధీ ఎప్పుడైనా అనునకున్నారా..? రామజన్మభూమిని ఇంతవరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా సందర్శించలేదని ఆరోపించారు. రుగ్వేదాన్ని పేర్కొంటూ సనాతన ధర్మం గొప్పతనానని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని, ఇది సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాలతో పోల్చాడు. డీఎంకే పార్టీ నేత ఏ. రాజా సనాతనాన్ని సామాజిక కళంకంగా, ఎయిడ్స్, కష్టులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!