Alasanda Vadalu: హోటల్ స్టైల్లో కరకరలాడే వడలు.. ఇంట్లోనే సులభంగా ఇలా ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alasanda Vadalu: సాయంత్రం వేళ వేడివేడిగా, కారంగా ఏదైనా తినాలనిపిస్తే అందరికీ గుర్తొచ్చేది వడలు. ముఖ్యంగా అలసంద వడలు వాటి రుచి, క్రిస్పీనెస్కి ఎవరినైనా ఫిదా కావాల్సిందే. అయితే చాలామందికి వడలు చేసేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోవడం లేదా మెత్తగా అయిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అస్సలు నూనె పీల్చకుండా, పైన క్రిస్పీగా.. లోపల గుల్లగా ఉండేలా అలసంద వడలు ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Vijay – Rashmika: పాపం.. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివర్రా..
Also Read
కావలసిన పదార్థాలు:
* అలసందలు (బొబ్బర్లు) – 1 కప్పు
* మినపగుళ్లు – 1 టేబుల్ స్పూన్ (జిగురు, క్రిస్పీనెస్ కోసం)
* పచ్చిమిర్చి – 4 నుంచి 5
* అల్లం – 1 ఇంచు ముక్క
* జీలకర్ర – 1 టీస్పూన్
* ధనియాలు – 1 టీస్పూన్
* ఉల్లిపాయ తరుగు – అర కప్పు
* కొత్తిమీర, కరివేపాకు – తగినంత
* ఉప్పు – రుచికి సరిపడా
* నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం..
ముందుగా ఒక కప్పు అలసందలకు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్లు కలిపి, శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా మినపగుళ్లు వేయడం వల్ల వడలకు మంచి బైండింగ్ రావడమే కాకుండా, నూనె పీల్చకుండా కరకరలాడుతూ వస్తాయి. మిక్సీ జార్లో ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ ధనియాలు వేసి కొంచెం కోర్సుగా (బరకగా) గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టిన అలసందలను నీళ్లు లేకుండా పూర్తిగా వడకట్టాలి. మిక్సీ జార్లో ఈ అలసందలు, మినపగుళ్లు, సరిపడా ఉప్పు వేసి అస్సలు నీళ్లు పోయకుండా బరకగా గ్రైండ్ చేయాలి. పిండిని మరీ మెత్తగా చేస్తే వడలు ముద్దగా వస్తాయి, కాబట్టి బరకగా ఉండేలా చూసుకోవాలి.
రుబ్బిన పిండిలో ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, కరివేపాకు మరియు ముందుగా సిద్ధం చేసిన పచ్చిమిర్చి మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, కొద్దిగా పిండిని తీసుకుని వడల్లా ఒత్తుకుని నూనెలో వేయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో వేయిస్తే లోపల పచ్చిగా ఉండిపోతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్ మాత్రమే వాడాలి. వడలు క్రిస్పీగా రావడానికి మినపగుళ్లు కీలకం. పిండి రుబ్బేటప్పుడు అస్సలు నీళ్లు వాడకూడదు. ఇది వడలు నూనె పీల్చకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ వడలను అల్లం చట్నీ, పల్లి చట్నీ లేదా నాన్-వెజ్ గ్రేవీ కర్రీలతో తింటే రుచి మామూలుగా ఉండదు. కుదిరితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి.
READ ALSO: Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!
తాజావార్తలు
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!