థియేటర్లలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో హారర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ మూవీ సైతాన్.. డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి టాక్ ను అందుకుంది..
సినిమా మొత్తం ఉత్కంఠభరితమైన సీన్స్ లతో ఆకట్టుకుంటుంది.. కథ మొత్తం కొత్తగా ఉండటంతో సినిమా జనాలకు బాగా నచ్చేసింది.. దాంతో సినిమా ఏకంగా 200 గ్రాస్ ను రాబట్టింది.. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు. సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.. ఎనిమిది వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం.. వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్పాండే, అజయ్ దేవ్గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.. ఇక ప్రముఖ దర్శకుడు అమిత్ త్రివేదీ సంగీతం అందించారు..