Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!
- ఖండ్వాలో దారుణం..
- భార్యను చంపించేందుకు భర్తే సుపారీ
- పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో ఒక సినిమా స్టోరీకి మించిన దారుణ ఘటన వెలుగుచూసింది. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. మొదట్లో ఇది దోపిడీ హత్యలా కనిపించినా.. చివరికి భర్తే అని తెలిసి అందరి గుండెల దడ పుట్టించింది. మరి ఈ హత్య గల పూర్తి వివరాలను చూస్తే..
పద్మనగర్ థానా పరిధిలోని డిగరిస్ గ్రామంలో మహిళపై రాత్రివేళ దాడి జరిగింది. ఆ దాడిలో భర్తకు స్వల్ప గాయాలు కాగా, భార్యను కత్తులతో 40 సార్లకు పైగా పొడిచి దారుణంగా చంపేశారు. ఈ ఘోరానికి నేరుగా భర్తే సూత్రధారి అని పోలీసు విచారణలో బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితులు టెలివిజన్లోని క్రైమ్ పేట్రోల్ వంటి క్రైమ్ షోలు చూసి ఈ హత్యా ప్రణాళికను రూపొందించారు. భర్త మహేంద్ర, తన స్నేహితులు హేమంత్ అలియాస్ కాన్హా, ఆర్యన్, రాజేంద్రలతో కలసి ఈ హత్యను అమలు చేయించాడు. భార్యను చంపించడానికి భర్త ఒక లక్ష రూపాయల సుపారీ ఇచ్చాడని హేమంత్ విచారణలో ఒప్పుకున్నాడు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
bike riders dangerous stunts: అరేయ్… ఏంట్రా ఇది.. ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా..
మహేంద్ర, హత్యకు రెండు రోజుల ముందు తన ఫోన్ పోయిందని ఇంట్లో చెప్పి కుటుంబాన్ని తప్పుదారి పట్టించాడు. అదే విధంగా ఘటన రోజు రాత్రి సమయంలో.. కడుపు నొప్పి వస్తోందని చెప్పి భార్యను తనతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ మధ్యలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో మిత్రులు దాడి చేసి భార్యను కత్తిపోట్లు పొడిచి చంపేశారు. భర్తకు తేలికపాటి గాయాలు మాత్రమే కలిగించగా, మొత్తం సన్నివేశం దోపిడీలా కనిపించేలా నటించారు.
పోలీసులు విచారణలో వైద్యులను సంప్రదించగా.. మహేంద్రకు ఎలాంటి కడుపు నొప్పి లేదని తేలింది. దీంతో పోలీసులు అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక విచారణలో హేమంత్ నేరాన్ని ఒప్పుకోవడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. నిందితులు హత్యకు కావాల్సిన కత్తులు, గ్లౌజులు ఖండ్వాలోనే కొనుగోలు చేసినట్లు కూడా బయటపడింది. పోలీసుల ప్రకారం, మహేంద్ర తన రెండో భార్య అయిన మృతురాలితో తరచూ విభేదాలు జరిగేవని తేలింది. భార్య తిట్లు తిట్టడం, కుటుంబ సభ్యులతో సరిగ్గా ప్రవర్తించకపోవడం కారణంగా విసిగి, ఈ హత్యా ప్రణాళిక రూపొందించినట్లు హంతకుడు చెప్పినట్లు సమాచారం. సుపారీ ఇచ్చిన ఆధారాలు, అడ్వాన్స్గా చెల్లించిన 10 వేల రూపాయలు, హత్యలో ఉపయోగించిన కత్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
PAK vs SL: మెరిసిన షాహీన్ అఫ్రిది.. పాకిస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం!
దీనితో ఈ కేసులో ప్రధాన నిందితుడు భర్త మహేంద్రతో పాటు హేమంత్, ఆర్యన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రాజేంద్ర ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందానికి ఖండ్వా ఎస్పీ మనోజ్ కుమార్ రాయ్ నగదు బహుమతి ప్రకటించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!