Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!
- ఖండ్వాలో దారుణం..
- భార్యను చంపించేందుకు భర్తే సుపారీ
- పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో ఒక సినిమా స్టోరీకి మించిన దారుణ ఘటన వెలుగుచూసింది. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. మొదట్లో ఇది దోపిడీ హత్యలా కనిపించినా.. చివరికి భర్తే అని తెలిసి అందరి గుండెల దడ పుట్టించింది. మరి ఈ హత్య గల పూర్తి వివరాలను చూస్తే..
పద్మనగర్ థానా పరిధిలోని డిగరిస్ గ్రామంలో మహిళపై రాత్రివేళ దాడి జరిగింది. ఆ దాడిలో భర్తకు స్వల్ప గాయాలు కాగా, భార్యను కత్తులతో 40 సార్లకు పైగా పొడిచి దారుణంగా చంపేశారు. ఈ ఘోరానికి నేరుగా భర్తే సూత్రధారి అని పోలీసు విచారణలో బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితులు టెలివిజన్లోని క్రైమ్ పేట్రోల్ వంటి క్రైమ్ షోలు చూసి ఈ హత్యా ప్రణాళికను రూపొందించారు. భర్త మహేంద్ర, తన స్నేహితులు హేమంత్ అలియాస్ కాన్హా, ఆర్యన్, రాజేంద్రలతో కలసి ఈ హత్యను అమలు చేయించాడు. భార్యను చంపించడానికి భర్త ఒక లక్ష రూపాయల సుపారీ ఇచ్చాడని హేమంత్ విచారణలో ఒప్పుకున్నాడు.
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
bike riders dangerous stunts: అరేయ్… ఏంట్రా ఇది.. ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా..
మహేంద్ర, హత్యకు రెండు రోజుల ముందు తన ఫోన్ పోయిందని ఇంట్లో చెప్పి కుటుంబాన్ని తప్పుదారి పట్టించాడు. అదే విధంగా ఘటన రోజు రాత్రి సమయంలో.. కడుపు నొప్పి వస్తోందని చెప్పి భార్యను తనతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ మధ్యలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో మిత్రులు దాడి చేసి భార్యను కత్తిపోట్లు పొడిచి చంపేశారు. భర్తకు తేలికపాటి గాయాలు మాత్రమే కలిగించగా, మొత్తం సన్నివేశం దోపిడీలా కనిపించేలా నటించారు.
పోలీసులు విచారణలో వైద్యులను సంప్రదించగా.. మహేంద్రకు ఎలాంటి కడుపు నొప్పి లేదని తేలింది. దీంతో పోలీసులు అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక విచారణలో హేమంత్ నేరాన్ని ఒప్పుకోవడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. నిందితులు హత్యకు కావాల్సిన కత్తులు, గ్లౌజులు ఖండ్వాలోనే కొనుగోలు చేసినట్లు కూడా బయటపడింది. పోలీసుల ప్రకారం, మహేంద్ర తన రెండో భార్య అయిన మృతురాలితో తరచూ విభేదాలు జరిగేవని తేలింది. భార్య తిట్లు తిట్టడం, కుటుంబ సభ్యులతో సరిగ్గా ప్రవర్తించకపోవడం కారణంగా విసిగి, ఈ హత్యా ప్రణాళిక రూపొందించినట్లు హంతకుడు చెప్పినట్లు సమాచారం. సుపారీ ఇచ్చిన ఆధారాలు, అడ్వాన్స్గా చెల్లించిన 10 వేల రూపాయలు, హత్యలో ఉపయోగించిన కత్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
PAK vs SL: మెరిసిన షాహీన్ అఫ్రిది.. పాకిస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం!
దీనితో ఈ కేసులో ప్రధాన నిందితుడు భర్త మహేంద్రతో పాటు హేమంత్, ఆర్యన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రాజేంద్ర ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందానికి ఖండ్వా ఎస్పీ మనోజ్ కుమార్ రాయ్ నగదు బహుమతి ప్రకటించారు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!