Taneti Vanitha: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్.. టీడీపీ హింసాకాండ మీద చర్యలకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taneti Vanitha: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి ఓటు వేయలేదు అన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు. టీడీపీ దౌర్జన్యాలను హింసకాండను తక్షణమే అడ్డుకోవడంలో విఫలమైతే.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు.
Read Also: Andhra Pradesh Election 2024: సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఏపీ ఎలెక్షన్స్.. ప్రతి సీనూ క్లైమాక్సే!
Also Read
దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు. ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ తీరుతో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదులను అడ్డుపెట్టుకుని బాధ్యతారాహితంగా ఎక్కడికక్కడ చేసిన బదిలీల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని హోంమంత్రి వనిత డీజీపీకి వివరించారు. పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు హింసకు పాల్పడుతుంటే స్థానిక పోలీసులు పట్టనట్లు ఉన్నారని, వారంతా నిబంధనల ప్రకారం వ్యవహరించేలా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దౌర్జన్యకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను హోం మంత్రి తానేటి వనిత కోరారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!