Online Medicine Ban: ఆన్లైన్లో మెడిసిన్స్ ఆర్డర్ చేయడంపై నిషేదం
Online Medicine Ban: మీకు అనారోగ్యంగా ఉందా..మెడికల్ షాప్ కు వెళ్లి మందులు తెచ్చుకోలేకపోతున్నారా.. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి మెడిసిన్స్ తెప్పించుకుంటున్నారా.. ఇప్పటి వరకు ఇందంతా బాగానే నడిచింది. ఇక మీదట కుదరదు. ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేయడం ఇకపై కష్టంగా అనిపించవచ్చు. దీనికి సంబంధించి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాసింది. ఆన్లైన్లో మందుల కొనుగోలును నిషేధించాలని ఏఐఓసీడీ కేబినెట్ లేఖలో డిమాండ్ చేసింది. ఆన్లైన్ మెడిసిన్ విక్రేతలు మందుల కొనుగోలు నిబంధనలను సరిగ్గా పాటించడం లేదని కెమిస్ట్ బాడీ తెలిపింది. దీంతో ప్రజలు ఆన్లైన్లో మందులు కొనుగోలు చేస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. అందుకే దీన్ని నిషేధించాలని కోరింది.
Read Also:RGV: స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కి కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని పరిస్థితి
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
AIOCD ప్రజల జీవితాల గురించి చాలా ఆందోళన చెందుతోంది. దీని కారణంగా ఆన్లైన్లో మందుల కొనుగోలు, అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేసింది. ఇంతకుముందు కూడా ఢిల్లీ హైకోర్టు ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించింది. హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఈ-ఫార్మసీలు లైసెన్స్ లేని మందులను ఆన్లైన్లో విక్రయించడాన్ని నిషేధిస్తూ 2018 ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను లేఖలో ఉదహరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇలాంటి విక్రయాలను వెంటనే నిషేధించాలని కూడా ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అనేక ఈ-ఫార్మసీలు ఆన్లైన్లో మందుల విక్రయాన్ని కొనసాగించాయి. AIOCD కూడా చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఈ-ఫార్మసీ 4.5 సంవత్సరాలకు పైగా మందులను విక్రయిస్తోందని తెలిపింది.
Read Also:Summer heat: రికార్డు స్థాయిలో ఎండలు.. హుజూర్నగర్ లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత
ఐటీ చట్టాన్ని కంపెనీలు పాటించడం లేదు
ఆన్లైన్లో ఔషధాలను విక్రయించడానికి చాలా కంపెనీలకు లైసెన్స్ కూడా లేదని AIOCD లేఖలో పేర్కొంది. లైసెన్సు లేకుండా మందులు విక్రయిస్తోంది. ఆన్లైన్లో ఔషధాలను విక్రయించాలంటే కంపెనీలు ఐటీ చట్టాల నిబంధనలను పాటించాలి. చాలా కంపెనీలు పాటించడం లేదు. దీంతో ఆన్ లైన్ విక్రయాలపై హైకోర్టు నిషేధం విధించింది. ఇటీవల డ్రగ్ కంట్రోలర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 20 ప్రసిద్ధ ఆన్లైన్ ఫార్మసీలకు నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో