Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి 250ఏళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లా కోర్టు 250ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించి కోట్లాది రూపాయలను ముంచిన సాయి ప్రసాద్ కంపెనీ డైరెక్టర్ కు 250 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాదు ఈ కంపెనీ సెహోర్ బ్రాంచ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడింది. 250 ఏళ్ల శిక్ష పడిన నిందితుడి పేరు బాలాసాహెబ్ భాప్కర్.
Read Also: Asteroid: భూమికి దగ్గరగా గ్రహశకలం.. పడితే ఓ నగరమే ఖతం
Also Read
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
భాప్కర్తో పాటు కంపెనీ సెహోర్ బ్రాంచ్లోని ఉద్యోగులు దీప్సింగ్ వర్మ, లఖన్లాల్ వర్మ, జితేంద్ర కుమార్, రాజేష్ పర్మార్లకు కూడా ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సెహోర్ జిల్లా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ కుమార్ షాహి ఈ శిక్షను ఖరారు చేశారు. నిందితుడు బాలాసాహెబ్ భాప్కర్ సాయిప్రసాద్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా ఐదేళ్లలో డబ్బు రెట్టింపు చేస్తామని వినియోగదారులకు ఎర వేశారు.
Read Also: Lovers : ప్రియుడి వేధింపులు.. ప్రియురాలు ఏం చేసిందంటే..
అతడి మాయలో పడి చాలా మంది ఈ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టారు. అయితే డబ్బులు చెల్లించే సమయానికి ఉద్యోగులు కంపెనీకి తాళం వేసి పరారీ అయ్యారు. కంపెనీకి చెందిన కస్టమర్లు డబ్బులు వసూలు చేసేందుకు కంపెనీ కార్యాలయానికి చేరుకోగా.. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. ఈ కేసులో 2016లో సెహోర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఆర్ఐ నమోదైంది. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ డైరెక్టర్కి కోర్టు 250 ఏళ్ల శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!