Maharashtra Next CM: “మోడీకి నా కొడుకు అంటే చాలా ఇష్టం. నా కుమారుడే సీఎం అవుతాడు”
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల
- తదుపరి ముఖ్యమంత్రిపై ప్రశ్న
- తాజాగా స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి
- తన కొడుకంటే మోడీకి ఇష్టమన్న సరితా ఫడ్నవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదే అతిపెద్ద ప్రశ్న. మరి మహాయుతి వర్గాల్లో ఏ పార్టీ అధినేతకు ఏ స్థానం దక్కుతుంది? ఈ ప్రశ్నల నడుమ దీనికి సంబంధించిన కొన్ని రియాక్షన్లు కూడా రావడం మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి శనివారం మాట్లాడుతూ.. తన కొడుకు ప్రధాని నరేంద్ర మోడీకి ‘అభిమానం’ అని, బీజేపీలోని ప్రతి ఒక్కరూ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అతడే అవుతాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
READ MORE: Anantapur: ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నందున నాగ్పూర్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. “సవాళ్లను ఎలా అధిగమించాలో తన కుమారుడికి తెలుసు. పార్టీలో అందరూ నా కుమారుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నా కుమారుడి అలుపెరగని కృషి, ప్రజల అభిమానమే ఈ విజయం సాధించింది. గత రెండేళ్లుగా తన కుమారుడిని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. అందుకే నా కొడుకు ఆధునిక కాలపు అభిమన్యుడిగా అభివర్ణించుకున్నాడు.” అని ఆమె తెలిపారు.
READ MORE: Rahul Gandhi: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ
అయితే, 2019లో మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56 స్థానాల్లో విజయం సాధించింది. అయితే రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకున్న తర్వాత బీజేపీ, శివసేన మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత మహాకూటమి(కాంగ్రెస్+ఎన్సీపీ)తో జత కట్టిన శివసే మహావికాస్ అఘాడిగా ఏర్పడింది. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అనే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఉద్ధవ్ ఠాక్రే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2022లో షిండే బీజేపీతో జత కట్టడంతో మరోసారి బీజేపీ+ శివసేన(షిండేవర్గం)+ ఎన్సీపీ(పవార్) అధికారంలోకి వచ్చింది. సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు పదవులు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?