High alert: పఠాన్కోట్లో అనుమానస్పద వ్యక్తులు సంచారం.. పోలీసులు అలర్ట్
- పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచారం
- జమ్మూలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- జమ్మూలోని ఆర్మీ పాఠశాలలు శనివారం వరకు మూసివేత
- అనుమానితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
- అనుమానితులలో ఒకరి స్కెచ్ను విడుదల చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను ఒక మహిళ చూసినట్లు నివేదించడంతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా జమ్మూలోని ఆర్మీ పాఠశాలలను శనివారం వరకు మూసివేయనున్నారు. భద్రతను నిర్ధారించడానికి కీలకమైన ఆర్మీ మరియు డిఫెన్స్ ఇన్స్టాలేషన్ల వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పంజాబ్ పోలీసులు వారిని వెతికి పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే.. అనుమానితులలో ఒకరి స్కెచ్ను పోలీసులు విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్న నేపథ్యంలో.. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు.
Read Also: SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
పఠాన్కోట్లో అనుమానితుల ఆగడాల పరంపర ఆగడం లేదు. గురువారం అర్థరాత్రి ఫాంగ్టోలి గ్రామంలో ముగ్గురు అనుమానితులు కనిపించారు. సమాచారం ప్రకారం.. గురువారం అర్థరాత్రి, ముగ్గురు అనుమానితులు ఫాంగ్టోలి గ్రామంలో గోడ దూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి రొట్టెలు కావాలని అడిగారు. వారిని చూసి భయాందోళనకు గురైన కుటుంబీకులు తలుపులు తీయలేదు. దీంతో.. అనుమానితులు కాసేపటి తర్వాత వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ మొత్తం విషయంపై పోలీసులకు సమాచారం అందించామని ఇంటి యజమాని బలరామ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. డెడ్లీ కమాండో ఫోర్స్ వారి కోసం ప్రతి చోట వెతికారు. అనుమానితుల కదలికలతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, సైన్యం ఉదయం నుంచి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మామున్ సైనిక ప్రాంతం ఫాంగ్టోలి సమీపంలో ఉంది. జూన్ 26 నుంచి పఠాన్కోట్లో 17 మంది అనుమానితులు కనిపించారు. అయితే.. పోలీసులు, భద్రతా సంస్థలు వారిని పట్టుకోలేకపోయారు.
Read Also: Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్
తాజావార్తలు
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!