పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను ఒక మహిళ చూసినట్లు నివేదించడంతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా జమ్మూలోని ఆర్మీ పాఠశాలలను శనివారం వరకు మూసివేయనున్నారు. భద్రతను నిర్ధారించడానికి కీలకమైన ఆర్మీ మరియు డిఫెన్స్ ఇన్స్టాలేషన్ల వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పంజాబ్ పోలీసులు వారిని వెతికి పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే.. అనుమానితులలో ఒకరి స్కెచ్ను పోలీసులు విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్న నేపథ్యంలో.. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు.
Read Also: SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
పఠాన్కోట్లో అనుమానితుల ఆగడాల పరంపర ఆగడం లేదు. గురువారం అర్థరాత్రి ఫాంగ్టోలి గ్రామంలో ముగ్గురు అనుమానితులు కనిపించారు. సమాచారం ప్రకారం.. గురువారం అర్థరాత్రి, ముగ్గురు అనుమానితులు ఫాంగ్టోలి గ్రామంలో గోడ దూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి రొట్టెలు కావాలని అడిగారు. వారిని చూసి భయాందోళనకు గురైన కుటుంబీకులు తలుపులు తీయలేదు. దీంతో.. అనుమానితులు కాసేపటి తర్వాత వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ మొత్తం విషయంపై పోలీసులకు సమాచారం అందించామని ఇంటి యజమాని బలరామ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. డెడ్లీ కమాండో ఫోర్స్ వారి కోసం ప్రతి చోట వెతికారు. అనుమానితుల కదలికలతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, సైన్యం ఉదయం నుంచి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మామున్ సైనిక ప్రాంతం ఫాంగ్టోలి సమీపంలో ఉంది. జూన్ 26 నుంచి పఠాన్కోట్లో 17 మంది అనుమానితులు కనిపించారు. అయితే.. పోలీసులు, భద్రతా సంస్థలు వారిని పట్టుకోలేకపోయారు.
Read Also: Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్