Hema Malini: ప్రచారంలో సరికొత్త అవతారం.. ఏం చేశారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా జోరుగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీ నుంచి బాలీవుడ్ హీరోయిన్లు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. హిమాచల్ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్, ఉత్తరప్రదేశ్ మథుర నుంచి హేమ మాలిని బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు నడుచుకుంటున్నారు. ఇటీవల కంగనా రనౌత్.. మండీలో అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు. తాజాగా హేమ మాలిని కూడా వ్యవసాయ కూలిగా అవతారమెత్తారు. పొలంలోకి వెళ్లి కూలీలతో కలిసి గోధుమ పంటను కోశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
పదేళ్లుగా క్రమతం తప్పకుండా రైతులతో మమేకం అవుతున్నట్లు హేమ మాలిని ఎక్స్ వేదికగా ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే ఈసారి కూడా రైతులతో కలిసి పని చేసినట్లు తెలిపారు. రైతుల మధ్య ఇలా ఉండడం తనకు ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. హేమ మాలిని పొలంలోకి రావడంతో రైతులు, కూలీలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మథుర నియోజకవర్గం నుంచి హేమ మాలిని మూడోసారి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా వ్యవసాయ పొలాల్లోకి దిగి ఫొటోలకు ఫోజులిచ్చారు. కూలీలతో కలిసి కొంతసేపు గోధుమ పంటను కోశారు.

మథుర నియోజకవర్గం బీజేపీకి కంచుకోట లాంటిది. 2014, 2019 ఎన్నికల్లో హేమ మాలిని ఇక్కడ విజయం సాధించారు. ఆమె భర్త ధర్మేంద్ర కూడా ప్రచారం నిర్వహించారు. మరోసారి విజయం కోసం హేమ మాలిని రంగంలోకి దిగారు. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోడీ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 3 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఇండియా కూటమిలో భాగంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపాయి.
ఇక దేశ వ్యాప్తంగా ఏడు దిశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k
— Hema Malini (@dreamgirlhema) April 11, 2024
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!