Farmers protest : టెన్షన్.. టెన్షన్ ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. పార్లమెంట్ ముట్టడికి యత్నం
- ఢిల్లీలో మరోసారి టెన్షన్ వాతావరణం
- మరోసారి ఢిల్లీకి రైతుల పాదయాత్ర
- పార్లమెంట్ భవనం ముట్టడికి ప్రయత్నం
- 5000 మంది సైనికుల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ను ముట్టడించేందుకు వేలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ రైతులు నోయిడాలో ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ 5000 మంది సైనికులను మోహరించారు. రైతుల పాదయాత్రతో నోయిడాలో చాలా చోట్ల జామ్ ఏర్పడింది. మహామాయ ఫ్లైఓవర్ కింద రైతులు ఏకం అయ్యేందుకు ప్లాన్ చేశారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా కొనసాగిస్తున్నారు. పలు మార్గాలను దారి మళ్లించారు.
భారీగా ట్రాఫిక్ జామ్…
రైతులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఢిల్లీకి వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిల్లా సరిహద్దులో వాహనాల చక్రాలు ఆగిపోతున్నాయి. అదే సమయంలో ఢిల్లీకి పాదయాత్ర చేయడంపై రైతులు పట్టుదలతో ఉన్నారు. ఢిల్లీ-నోయిడా, చిల్లా సరిహద్దుల్లో రైతులను నిలువరించేందుకు పోలీసులను సిద్ధంగా ఉంచారు. ఉదయం నుంచి ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
భారీగా భద్రతా బలగాల మోహరింపు..
గ్రేటర్ నోయిడా యమునా అథారిటీ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి వెళ్లిపోయారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా రైతులు ఆగలేదు. రైతులతో నిరంతరం చర్చలు జరుగుతున్నాయని నోయిడా పోలీస్ అదనపు కమిషనర్ లా అండ్ ఆర్డర్ శివ హరి మీనా చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా 5 వేల మంది సైనికులను మోహరించారు. వెయ్యి మంది పీఏసీ సిబ్బందితోపాటు నీటి ఫిరంగులు, వజ్ర వాహనాలు, టియర్ గ్యాస్, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైన పరికరాలు అక్కడికి చేర్చారు. ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఆదివారమే మళ్లింపు మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు సలహాలు జారీ చేశామని మీనా చెప్పారు. అయినా.. ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది.
మహామాయ ఫ్లవర్ ద్వారా…
నిజానికి మహామాయ ఫ్లవర్ మీదుగా ఢిల్లీ వెళ్లి పార్లమెంటును చుట్టుముడతామని కొన్ని రైతు సంఘాలు చెబుతున్నాయి. తమ డిమాండ్లను అంగీకరించడం లేదని చాలా కాలంగా వివిధ అధికారుల వద్ద చర్చలు జరుపుతున్నామని రైతులు చెబుతున్నారు. ఆదివారం కూడా కొన్ని గంటలపాటు జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. రైతుల మొత్తం ఐదు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. అందులో ప్రధాన డిమాండ్లు పరిహారం పెంచడంతోపాటు అధీకృత భూమిలో 10% అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వడం.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!