Tamilnadu rains: తమిళనాడును కుదిపేస్తున్న భారీ వర్షాలు.. నిండుకుండలా చెన్నై నగరం
Tamilnadu rains: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై నగరం నిండుకుండలా మారింది. చెన్నై, కడలూరు, కాంచీపురం, మధురై, కన్యాకుమారి సహా పలు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో చెన్నై సహా 28 జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించించింది. సబ్వేలను మూసివేసింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా అంచనా ప్రకారం నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, కడలూరు, ఈరోడ్, విల్లుపురం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై, మదురై, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తమిళనాడులోని తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం జిల్లాలకు భారత వాతావరణ శాఖ శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో చెన్నై, అనేక ఇతర జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం, ఈశాన్య శ్రీలంకలోని పరిసర ప్రాంతాలపై బాగా గుర్తించబడిన అల్పపీడనం శనివారం ఉదయం వరకు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇది శని, ఆదివారాల్లో తమిళనాడు, కేరళ మీదుగా వెళ్లే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Transplant Nose: గ్రేట్.. చేతిపై ముక్కును పెంచి ముఖానికి అతికించారు!
చెన్నైలో మొత్తం 169 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపేందుకు 879 మోటార్ పంపులను సిద్ధంగా ఉంచామని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.జనసాంద్రత ఎక్కువగా ఉండే చెన్నై జోన్లోనే మొత్తం 17 మంది మానిటరింగ్ అధికారులను నియమించగా, మిగిలిన జిల్లాలకు 43 మంది అధికారులు విధుల్లో ఉంటారు. చెంగల్పేట, కాంచీపురం, తిరువళ్లూరు మండలాలకు ఇద్దరు చొప్పున మానిటరింగ్ అధికారులను నియమించారు.
రాష్ట్రం 5,093 సహాయ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన 1,149 మంది సిబ్బందిని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) నుండి 899 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచింది.చెంబరంబాక్కం జలాశయం మొత్తం సామర్థ్యం 24 అడుగులు కాగా గురువారం ఉదయం 8 గంటల సమయానికి 20 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా పుఝల్ జలాశయం పూర్తి సామర్థ్యం 21.20 అడుగులకు గాను 18.53 అడుగులకు చేరుకుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!