Andhra Pradesh: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల్లో గ్రామాలు
- ఏపీలో భారీ వర్షాలు
- ఇంకా వరద నీటిలోనే లంక గ్రామాలు
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. మరోవైపు.. లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాల జోరు తగ్గలేదు. దీంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పోంగుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాలు క్రితం నుండి గెడ్డలు ఉధృతి వల్ల జనజీవనం స్తంభించి పోయింది.. వారపు సంతకు వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకొని రావడానికి 30 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. బైకులను డోలిమోత తీసుకొని వెళ్తున్నారు గిరిజనులు. వాగులు ఉధృతి చూసి కొంతమంది గిరిజనులు వెనుతిరుతుండగా.. మరికొందరు ప్రాణాలకు తెగించి దాటుతున్నారు.
Read Also: Paris Olympics 2024: రెండో రోజు భారత్ శుభారంభం..ఫైనల్ కి చేరిన టీంలు..
Also Read
అటు కోనసీమ జిల్లా లంక గ్రామాలలో నిత్యావసర సరుకులకు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. చుట్టూ వరద నీరు చేరడంతో అయోమయం చెందుతున్నారు. చంటి పిల్లలకు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Tamil Nadu: తమిళనాడులో మరో రాజకీయ హత్య.. ఏఐడీఎంకే నేత మర్డర్..
వర్షాలు కారణంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45 డివిజన్ లో ఇందిరా నగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వర్షంతో డ్రైనేజీలు పొంగిపోర్లి. మురికి నీరు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మురికి నీళ్లు విషసర్పాలు తాండవించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి వేళలో బయటికి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. కనీసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ.. ప్రజా ప్రతినిధులు గానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆక్రందన పెడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!