Anantapur Rains: అనంతపురం జిల్లాను వణికిస్తున్న వరదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వరదలతో అతలాకుతలం అవుతోంది. శ్రీ సత్య సాయి జిల్లా ఎడతెరిపి లేని వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం భవనంలోకి బురద చేరింది. దీంతో భవనం ఆరుబయట పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు. వివిధ కారణాలతో మరణించిన వారికి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలో భారీవర్షాలకు డెడ్ బాడీలు తడిసిముద్దయ్యాయి. ఉదయం పోస్టుమార్గం నిర్వహించాల్సి వుంది. మార్చురీ గదిలో కాలుపెట్టలేనంతగా బురద పేరుకుపోయింది. మృతిచెందిన వారి కుటుంబీకులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ నేతలు సవిత అధికారుల తీరుపై మండిపడ్డారు.
Read Also: Chennai Crime: రన్నింగ్ ట్రైన్ హత్య కేసులో ప్రియుడు అరెస్టు
Also Read
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
- Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా, జయమంగళి నదులు ప్రమాదకరంగా మారాయి. హిందూపురం పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో భారీగా మరవ పారుతుంది కొట్నూరు చెరువు నీరు. నీటి ప్రవాహానికి ఓ పక్క వాలిపోయింది లారీ. క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో హిందూపురం నుంచి అనంతపురానికి రాకపోకలు నిలిపివేశారు. పట్టణంలోని సింగిరెడ్డి పల్లి వద్ద ఇచర్ వాహనం రోడ్డు పై నిలిచిపోవడంతో అనంతపురం వెళ్లేందుకు ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు.
బారికేడ్లు వేసి రాకపోకలు పోలీసు నిలిపివేశారు. భారీ వర్షాల వల్ల చెరువులు పూర్తి స్థాయిలో మరోసారి నిండిపోయాయి. మొరవలు పారడంతో రోడ్లపై నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు పరిసర ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతపురం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయినవారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందిస్తారు. ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఈ ఐదు రకాల నిత్యావసర వస్తువులు అందిస్తారు. ఆర్ధిక సహాయ ఖర్చుల కోసం అనంతపురం జిల్లా కలెక్టర్కు 93 లక్షల మొత్తం విడుదల చేసింది ఆర్థికశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
Read Also: Astrology: అక్టోబర్ 14, శుక్రవారం దినఫలాలు
తాజావార్తలు
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..