విశాఖ గర్జన ర్యాలీ జోరు వానలోనూ కొనసాగుతోంది. 3 కిలోమీటర్లకు పైగా సాగే ఈ యాత్రను నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తుండగా.. అధికార వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అమరావతి వద్దు, రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు.. మూడురాజధానులు ముద్దు అంటూ బెలూన్లతో ర్యాలీ కొనసాగుతోంది.